AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మీ ఆత్మలు శాంతించుగాక! ఈగలు, బొద్దింకలకు నివాళి.. 40ఏళ్లుగా సాగుతున్న వింత సంప్రదాయం..?

సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు మనం నివాళులు అర్పించడం చూస్తాము. అలాగే, కొన్నిసార్లు కొందరు తమ ప్రియమైన పెంపుడు జంతువులు చనిపోయినప్పుడు కూడా నివాళులు అర్పిస్తారు. కానీ, కీటకాలు చనిపోయినప్పుడు ఎవరైనా మౌనం పాటించటం, నివాళులు అర్పించటం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా..? కానీ, ఒక పురుగుమందుల కంపెనీ ప్రతి సంవత్సరం అలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో ఇక్కడ చూద్దాం...

Viral News: మీ ఆత్మలు శాంతించుగాక! ఈగలు, బొద్దింకలకు నివాళి.. 40ఏళ్లుగా సాగుతున్న వింత సంప్రదాయం..?
Tribute To Insects
Jyothi Gadda
|

Updated on: Jan 07, 2026 | 1:07 PM

Share

కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది చనిపోతే కనీసం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు చాలా మంది. కానీ, చనిపోయిన కీటకాలకు నివాళులు అర్పించే కంపెనీ ఒకటి ఉంది. అవును, సదరు కంపెనీ గత 40 సంవత్సరాలుగా వారు చంపిన కీటకాలకు వారే నివాళులు అర్పిస్తారు. వినడానికి వింతగా అనిపించినప్పటికీ ఇది నిజమే నండోయ్… ఎర్త్ కార్పొరేషన్ జపాన్‌లో అత్యుత్తమ గృహ పురుగుమందుల సంస్థ. దశాబ్దాల పరిశోధన ద్వారా ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. దాని ఉత్పత్తుల ప్రభావాన్ని పరీక్షించడానికి, కంపెనీ అకోలోని దాని పరిశోధనా కేంద్రంలో వివిధ కీటకాల జాతులను ఉపయోగిస్తుంది.

పరిశోధన ప్రక్రియలో కొన్ని కీటకాలు చనిపోతాయి. ఎర్త్ కార్పొరేషన్ కీటకాల మరణాలను తేలికగా తీసుకోదు. ఇందులో భాగంగా గత 40 సంవత్సరాలుగా వారు చంపిన కీటకాలకు వారు నివాళులు అర్పిస్తున్నారు. ఇది అకో నగరంలోని మైయోడోజీలో ఈ కీటకాలకు స్మారక సేవను నిర్వహిస్తుంది. గత నెలలో 60 మందికి పైగా సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చనిపోయిన కీటకాల ఫోటోల ముందు వారంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

దోమలు, ఈగలు, బొద్దింకలు, ఇతర కీటకాల ఫోటోలను అక్కడ ఉంచి ప్రజలు వాటి కోసం ప్రార్థిస్తారు. ఎర్త్ కార్పొరేషన్ పరిశోధన బృందం కోసం 1 మిలియన్ బొద్దింకలు, 100 మిలియన్లకు పైగా కీటకాలను ఉపయోగిస్తుంది. ఈ కీటకాలు మానవుల కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తాయి. అందువల్ల, మరణించిన కీటకాలకు నివాళులు అర్పించడానికి ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎర్త్ కార్పొరేషన్ గత నాలుగు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేకమైన వేడుకను నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?