Video Viral: సమస్యలను చెప్పేందుకు రిపోర్టర్గా మారిన చిన్నారి.. కెమెరామెన్ అమ్మతో కలిసి..
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిందో తెలిసిన విషయమే. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇంటర్నెట్లో మునిగితెలుతుంటారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిందో తెలిసిన విషయమే. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇంటర్నెట్లో మునిగితెలుతుంటారు. సోషల్ మీడియా ద్వారా కొన్ని సందర్భాల్లో మట్టిలో ఉన్న టాలెంట్స్ ప్రపంచానికి తెలిసాయి. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు ఇంటర్నెట్ ద్వారా అధికారుల దృష్టికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ చిన్నారి తమ ఇంటి దగ్గర ఉన్న రోడ్డు దుస్థితిని అధికారులకు తెలియజేసేందుకు రిపోర్టర్గా మారింది. తన తల్లి కెమెరాఉమెన్గా మారి వీడియో తీస్తుంటే.. మైక్ చేతపట్టి రోడ్డు పరిస్థితిని ఎంతో చక్కగా వివరించింది ఆ చిన్నారి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఓ చిన్నారి రిపోర్టర్గా మారి కాశ్మీర్ రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో.. ప్రజలు ఏ విధంగా చెత్త పారేస్తున్నారో వివరించింది. ఈ రోడ్లు అంత దారుణంగా ఉండడం వలన తన ఇంటికి అతిథులు రాలేకపోతున్నారని చెప్పుకొచ్చింది. అలాగే చివరలో కెమెరామెన్ అమ్మతో అని ముగించింది. ఇటీవల కశ్మీర్ లోయలో భారీ మంచు, వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమదైన శైలీలో స్పందిస్తున్నారు.
Meet Youngest reporter from the #Kashmir Valley. pic.twitter.com/4H6mYkiDiI
— Sajid Yousuf Shah (@TheSkandar) January 9, 2022
Also Read: Akhanda Movie: జై బాలయ్య ఫుల్ సాంగ్ వచ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్తో హల్చల్..
Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..
Balakrishna: మంత్రి హరీష్ రావును కలిసిన బాలకృష్ణ.. ఏ అంశాలపై చర్చించారంటే..