Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Street: ప్రజల ఇళ్లు, దుకాణాల మధ్య నుంచి వెళ్లే రైలు.. ! వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్ వేయండి..

ఈ ప్రదేశం చాలా కాలంగా వియాత్నం దేశంలో అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడికి ఎవరు వచ్చినా సెల్ఫీ తీసుకోకుండా వెళ్లరు. కొన్నిసార్లు ఇక్కడకు వచ్చే పర్యాటకుల భద్రత గురించి ఆందోళన చెందుతారు. రైలు ట్రాక్‌లపై కూర్చుని లేదా రైలు ట్రాక్‌పై పడుకుని ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడతారు.

Train Street: ప్రజల ఇళ్లు, దుకాణాల మధ్య నుంచి వెళ్లే రైలు.. ! వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్ వేయండి..
Unique Train Street
Follow us
Surya Kala

|

Updated on: Apr 11, 2023 | 1:05 PM

వియాత్నం దేశంలోని హనోయ్ గురించి చెప్పాలంటే.. ముందుగా ఎవరికైనా అగరబత్తుల తయారీ గ్రామం అని గుర్తుకొస్తుంది. అయితే ఈ కారణంగానే హనోయ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందలేదు. మరో ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇక్కడ మరో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విషయం కూడా ఉంది. రైలు వీధి ఉంది. ఓ రైలు ప్రజల గృహాలు, గ్రామాల గుండా వెళుతుంది. కొన్ని చోట్ల ఇంటికి రైల్వే ట్రాక్ ల మధ్య దూరం చాలా తక్కువగా ఉంది. దీంతో రైలు వస్తుంటే చాలు తమ ఇంటి ముందు ఉన్న తలుపులు గేట్లు మూసివేస్తారు. ఈ ప్రదేశం వియత్నాంలోని అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఒకటి. అందుకే ఈ రైలు వీధి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ రైలు వీధి గురించి తెలుసుకుందాం..

పర్యాటక ప్రదేశంగా మారిన రైలు వీధి  ఈ ప్రదేశం చాలా కాలంగా వియాత్నం దేశంలో అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడికి ఎవరు వచ్చినా సెల్ఫీ తీసుకోకుండా వెళ్లరు. కొన్నిసార్లు ఇక్కడకు వచ్చే పర్యాటకుల భద్రత గురించి ఆందోళన చెందుతారు. రైలు ట్రాక్‌లపై కూర్చుని లేదా రైలు ట్రాక్‌పై పడుకుని ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ నివసించే ప్రజలు రైలు రాకముందే తమ లగేజీని తీసివేసుకుంటారు. ఇలా రోజులో చాలాసార్లు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

రైలు వీధి మూసివేత  కొన్ని సంవత్సరాల క్రితం భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ పర్యాటక కార్యకలాపాలను అధికారులు మూసివేశారు. అయితే ఇప్పుడే  రహదారి ట్రాక్‌ల వెంట ఉన్న చిన్న కేఫ్‌లు తిరిగి తెరిచారు. ఎందుకంటే ఇది హనోయిలోని పురాతన ప్రాంతం.. చాలా కాలంగా నగరం  ఆర్థిక కేంద్రంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రాంతంలో చాలా ఎత్తైన భవనాల నిర్మాణం జరగలేదు. రైలు దాటిన వెంటనే ప్రజలు మళ్లీ రైల్వే ట్రాక్ చుట్టూ తమ పనిలో నిమగ్నమై ఉంటారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..