AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్‌: ప్రేమగా పెంచుకున్న పెంపుడు పిల్లులు.. ఆకలితో చివరకు యజమానినే పీకుతున్నాయి..

ఓ మహిళ తన ఇంట్లో దాదాపు 20 పిల్లుల్ని పెంచుకుంటోంది. వాటిని ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా చూసుకుంటోంది. కానీ, చివరకు ఆ పిల్లులే ఆమెను పీకుతిన్నాయి. ఈ షాకింగ్‌ ఘటన ..

షాకింగ్‌: ప్రేమగా పెంచుకున్న పెంపుడు పిల్లులు.. ఆకలితో చివరకు యజమానినే పీకుతున్నాయి..
Cats
Jyothi Gadda
|

Updated on: Jun 21, 2022 | 5:40 PM

Share

ఇటీవలి కాలంలో చాలా మంది తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకోవటం మామూలే అయిపోయింది. అనేక మంది తమకు ఇష్టమైన పెంపుడు జంతువులను పెంచుకుంటూ వాటిపై అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. కొందరు కుక్కల్ని పెంచుకుంటే, మరికొందరు పిల్లుల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు. అయితే, ఇక్కడ కూడా ఓ మహిళ తన ఇంట్లో దాదాపు 20 పిల్లుల్ని పెంచుకుంటోంది. వాటిని ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా చూసుకుంటోంది. కానీ, చివరకు ఆ పిల్లులే ఆమెను పీకుతిన్నాయి. ఈ షాకింగ్‌ ఘటన రష్యాలో చోటు చేసుకుంది.

రష్యాలోని రోస్టవ్‌లో ఓ మహిళ తన ఇంట్లో పిల్లుల్ని పెంచుకుంటోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 20 పిల్లుల్ని పెంచుకుంటోంది. అయితే రెండు వారాల క్రితం సదరు మహిళ ఇంట్లోనే ప్రమాదవశాత్తు కింద పడి మరణించింది. ఆ ఇంట్లో ఇంకా మరెవరూ లేకపోవటంతో ఆమె మృతదేహం అలాగే పడిఉంది. మరోవైపు ఆ పిల్లులకు తిండిపెట్టేవారు లేకుండా పోయారు. అలా రెండు వారాల పాటు ఆకలితో అలమటించిన ఆ పెంపుడు పిల్లలు చివరికి యజమాని మృతదేహాన్ని పీకుతున్నాయి. మృతురాలి సహోద్యోగి అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి సీన్‌ చూసి షాక్‌తిన్నారు. హుటాహుటినా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు పీక్కు తినగా మృతదేహం లో కొంత భాగం మాత్రమే మిగిలి ఉండటం చూసి పోలీసులే కంగుతిన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ వార్త దవానంలా వ్యాపించింది. నెటిజన్లు సైతం జరిగిన ఘటనపై షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి