AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీకాకుళం సముద్ర తీరంలో అతి పెద్ద బ్లూ వేల్.. సెల్ఫీల కోసం ఎగబడిన జనాలు.. బరువెంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే…!

ఈ జిల్లా 193 కి.మీ. బంగాళాఖాతం తీరం వెంబడి విస్తరించి ఉంది. అందుకే ఈ తీర ప్రాంతంలో ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి. అరుదైన సముద్ర జీవులు కనిపిస్తూనే ఉన్నాయి. అరుదైన భారీ చేప కావడంతో డొంకూరు పరిసర గ్రామస్తులు ఈ వింత చేపను చూసేందుకు భారీగా తరలివచ్చారు. అంత పెద్ద చేపను చూసి కొందరు ఫోటోలు తీయగా, మరికొందరు దాంతో సెల్ఫీలు కూడా దిగారు. విషయం తెలుసుకున్న పలాస కాశీబుగ్గ అటవీశాఖ అధికారి

శ్రీకాకుళం సముద్ర తీరంలో అతి పెద్ద బ్లూ వేల్.. సెల్ఫీల కోసం ఎగబడిన జనాలు.. బరువెంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే...!
Rare Blue Whale
Jyothi Gadda
|

Updated on: Mar 04, 2024 | 7:16 AM

Share

సాగర తీరంలో ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా పొడవైన సముద్ర తీరం ఉంది కాబట్టి తరచూ అరుదైన సముద్ర జీవులు కనిపిస్తూ ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఈ క్రమంలో శ్రీకాకుళ్లం జిల్లా ఇచ్ఛాపుర మండలం డొంకూరు తీరానికి అరుదైన భారీ చచ్చిపోయిన చేప కొట్టుకుపోయింది. ఈ చేప దాదాపు 16 అడుగుల పొడవు, దాదాపు 6 అడుగుల వెడల్పు ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పొడవైన తీర రేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం. ఈ జిల్లా 193 కి.మీ. బంగాళాఖాతం తీరం వెంబడి విస్తరించి ఉంది. అందుకే ఈ తీర ప్రాంతంలో ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి. అరుదైన సముద్ర జీవులు కనిపిస్తూనే ఉన్నాయి.

అరుదైన ఈ చేప బరువు రెండు టన్నులు ఉంటుందని స్థానిక మత్స్యకారులు అంచనా వేశారు. ఇంత భారీ చేప ఎలా కొట్టుకువచ్చిందనే దానిపై సరైన సమాచారం లేదు. అయితే కొందరు ఆహారం అందక మరణించి ఉండవచ్చని, మరికొందరు సముద్రంలో భారీ పడవలు వెళుతుండగా గాయపడి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ చేపను స్థానికులు పులి బగ్గు పొర్ర చేపగా చెప్పారు.

అరుదైన భారీ చేప కావడంతో డొంకూరు పరిసర గ్రామస్తులు ఈ వింత చేపను చూసేందుకు భారీగా తరలివచ్చారు. అంత పెద్ద చేపను చూసి కొందరు ఫోటోలు తీయగా, మరికొందరు దాంతో సెల్ఫీలు కూడా దిగారు. విషయం తెలుసుకున్న పలాస కాశీబుగ్గ అటవీశాఖ అధికారి మురళీనాయుడు అక్కడికి చేరుకుని చనిపోయిన చేపను పరిశీలించి, పోస్టుమార్టం నిర్వహించి సముద్ర తీరంలో పూడ్చిపెట్టారు. కాకపోతే, మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
శకున శాస్త్రం: ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు!
శకున శాస్త్రం: ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు!