Viral: బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్రేలో
ఓ రెండేళ్ల చిన్నారికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు భయంతో పరుగు పరుగున ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ డాక్టర్లు ఎక్స్ రే తీశారు. ఆ ఎక్స్ రేలో కనిపించింది చూసి డాక్టర్లు దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా..

వియత్నాంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రెండు వారాల క్రితం రెండేళ్ల చిన్నారి విచిత్ర పరిస్థితుల్లో ఆస్పత్రిలో జాయిన్ అయింది. అనంతరం శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు.. ఆమె కడుపులో నుంచి 27 చిన్న చిన్న అయస్కాంతాలను తొలగించారు. ఈ అయస్కాంతాల కారణంగా చిన్నారి పేగు, కడుపులో చిల్లులు పడ్డాయని డాక్టర్లు చెప్పారు.
ఫిబ్రవరి 10వ తేదీన బిన్హొ సిటీలో నివాసముంటున్న డికా అనే రెండేళ్ల చిన్నారి తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరింది. అక్కడున్న డాక్టర్లు సదరు చిన్నారికి ఎక్స్రే, అల్ట్రాసౌండ్ తీయగా.. కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన ఆమెకు ఎండోస్కోపిక్ సర్జరీ చేశారు. కడుపులో నుంచి 11 అయస్కాంతాలు తొలగించడంతో పాటు.. పేగుల మధ్య ఇరుక్కుపోయిన మరో 8 అయస్కాంతాలను తీశారు. ఇక డుయోడినమ్ దగ్గర ఉన్న చిన్న ప్రేగులోకి ఇరుక్కుపోయిన మరో 8 అయస్కాంతాలను తొలగించి చిన్నారికి కుట్లు వేశారు డాక్టర్లు. దాదాపుగా 3 గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సతో మొత్తం మొత్తం 27 అయస్కాంతాలను తొలగించి.. అమ్మాయికి పునర్జన్మను అందించారు డాక్టర్లు.
చిన్న పిల్లలు కావడంతో అప్పుడప్పుడూ ఇలా జరుగుతుండటం సహజం అని డాక్టర్లు అన్నారు. కాగా, అయస్కాంతాలకు బలమైన చూషణ శక్తి ఉంటుందని, పిల్లలు వాటిలో మింగినప్పుడు, అవి పేగుల దగ్గద ఒకటికొకటి ఆకర్షించుకుని.. పేగుకు చిల్లులు, ఉదర ఇన్ఫెక్షన్ ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలను బ్యాటరీలు, అయస్కాంతాలు మొదలైన చిన్న చిన్న వస్తువులతో ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి