AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala: స్వాతంత్య్రానికి ముందు నుండి ఓటు వేస్తున్న వృద్ధురాలు..కలర్‌ బాక్స్‌ నుండి ఈవీఎంల వరకు..

త్రిక్కకర నియోజకవర్గంలో ఓటు వేయటానికి అతి వృద్ధ మహిళ ఒకరు పోలింగ్‌ బూత్‌కు వచ్చారు. త్రిక్కకర నియోజకవర్గంలో 100ఏళ్లు పై బడిన 22 మంది ఓటర్లలో ఆమె కూడా ఒకరు.

Kerala: స్వాతంత్య్రానికి ముందు నుండి ఓటు వేస్తున్న వృద్ధురాలు..కలర్‌ బాక్స్‌ నుండి ఈవీఎంల వరకు..
Thrikkakara Bypoll
Jyothi Gadda
|

Updated on: Jun 01, 2022 | 10:26 AM

Share

ఉత్తరాఖండ్, కేరళ, ఒడిషా రాష్ట్రాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు ఆయా రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నిక‌ల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో ప‌లువురు అగ్ర నేత‌లు పోటీలో ఉన్నారు. కాబ‌ట్టి ఈ ఎన్నిక‌ల‌పై దేశ వ్యాప్తంగా ఆస‌క్తి నెలకొంది. ఈ క్రమంలోనే కేర‌ళ వాణిజ్య రాజధాని కొచ్చిలోని త్రిక్కకర నియోజకవర్గంలో పోలింగ్‌ కొనసాగుతోంది. 239 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే, ఇక్కడ ఓ ఆసక్తి ఘటన చోటు చేసుకుంది. త్రిక్కకర నియోజకవర్గంలో ఓటు వేయటానికి అతి వృద్ధ మహిళ ఒకరు పోలింగ్‌ బూత్‌కు వచ్చారు. త్రిక్కకర నియోజకవర్గంలో 100ఏళ్లు పై బడిన 22 మంది ఓటర్లలో ఆమె కూడా ఒకరు. బ్యాలెట్‌ బాక్సుల నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల (ఈవీఎంలు) వరకు అన్నీ చూసింది ఆసియా అనే 108ఏళ్ల వృద్ధురాలు.

స్వాతంత్య్రానికి ముందు కలర్‌ బాక్స్‌ పద్ధతిలో ఓట్లు వేసిన విషయం ఆమెకు అస్పష్టంగా గుర్తుంది. ఆమె ఫ్రాంచైజీని ఉపయోగించండం ప్రారంభించిప్పుడు, ఆమె అభ్యర్థుల పేరు, సంతకంతో లేబుల్‌ చేయబడిన బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటు వేసే విధానం అందుబాటులో ఉండేది.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఈవీఎంల ద్వారా తన ఓటును నమోదు చేసుకున్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌లో భాగంగా 80ఏళ్లు దాటిని వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఆమె ఓటు వేయడానికి ముందు ఆసియా పిల్లలు, మనవరాళ్లు అభ్యర్థుల గురించి ఆమెకు చెప్పారు. ఇకపోతే, ఆసియా తన బంధువు అహ్మద్‌ను 14ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. పడముగల్‌లోని కన్నుంపురం వద్ద నేయితెల్‌లో అహ్మద్‌తో పాటుగా నివాసం ఉండేవారు. వీరికి 12 మంది సంతానం. కాగా, వారిలో నలుగురు చనిపోయారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్