కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు. తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె ఆమె. భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో కీలక నాయకురాలైన ఆమె.. ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలిగా ఉన్నారు. 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలిగా ప్రతినిథ్యంవహించారు. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. 2020 నుంచి ఎమ్మెల్సీ‌గా పనిచేస్తున్నారు. బీ టెక్, ఎంఎస్ చదవుకున్న కె కవిత.. 2006లో భారత్‌కు తిరిగిరావడానికి ముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. కవిత వ్యాపారవేత్త దేవనపల్లి అనిల్ కుమార్‌తో వివాహంకాగా.. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి కేసీఆర్‌తో కలిసి కె కవిత చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ కళలు, సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఆమె 2006లో తెలంగాణ జాగృతి సంస్థను నెలకొల్పారు. గతంలో బతుకమ్మ పండుకను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణతో పాటు విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కె కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను 2024 మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు.

ఇంకా చదవండి

Delhi: కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె బెయిల్‌ పిటిషన్లను రౌస్‌ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసి ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియల్ కస్టడీకి పంపింది. ఆ తరువాత ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ కోర్టులో కవిత వేసిన పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. దీంతో కవిత బెయిల్ కోసం ప్రయత్నించారు. తొలుత మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించిన కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుకాగా, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం పోరాడుతూనే ఉన్నారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 1:02 pm

కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..

లిక్కర్‌ స్కామ్ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. మే 6వ తేదీన తీర్పు వెల్లడిస్తామని రౌస్‌ అవెన్యూ కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‎పై గత మూడు రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో మే 6 తేదీన తీర్పు వెల్లడించనుంది.

  • Srikar T
  • Updated on: Apr 24, 2024
  • 7:47 pm

Delhi: కవిత కేసులో నేడు కీలకం.. కోర్టుకు హాజరుపరుచనున్న ఈడీ..

ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కీలకం కానుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. అలాగే కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు.

  • Srikar T
  • Updated on: Apr 22, 2024
  • 10:05 am

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోండి.. కేంద్ర హోంశాఖకు సుకేశ్ చంద్రశేఖర్ లేఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరారు సుకేశ్ చంద్రశేఖర్. ఈ మేరకు హోంశాఖకు లేఖ రాశారు. కవిత, సత్యేందర్ జైన్, అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరిపిన వాట్సాప్ చాట్స్‌ను హోంశాఖకు పంపారు. డబ్బుని నెయ్యిగా కోడ్ నేమ్‌తో పిలుస్తూ కవితతో చాటింగ్ చేశారని అన్నారు సుకేశ్.

Delhi Liquor Scam: అరెస్టుల పర్వం ముగిసిపోలేదు.. ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్.. గోవా ఎన్నికల వేళ..

Delhi's Liquor Policy Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో కేసు ఇక కొలిక్కి వచ్చిందనే అందరూ భావించారు. ఇక తుది చార్జిషీటు దాఖలు చేయడం ఒక్కటే మిగిలిందని, త్వరలో ట్రయల్ ప్రారంభమవుతుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దర్యాప్తు సంస్థలు మరిన్ని అరెస్టులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుతో కథ కంచికి చేరలేదని, అసలు కథ ఇంకా మిగిలే ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) అంటోంది.

Delhi: కవితను కోర్టుకు హాజరుపరిచిన సీబీఐ.. కోర్టు కీలక ఆదేశాలు..

ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచింది సీబీఐ. ఆమెను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలని ఢిల్లీ స్పెషల్ కోర్టును సీబీఐ కోరింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఆరోపిస్తోంది సీబీఐ. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం.. ఇవన్నీ కవిత కనుసన్నల్లోనే జరిగాయంటోంది.

  • Srikar T
  • Updated on: Apr 15, 2024
  • 10:41 am

Delhi: తిహార్ జైలులో కవితను కలవనున్న కేటీఆర్.. వీరికి మాత్రమే కోర్టు అనుమతి..

సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్రం ఆమె సోదరుడు కేటీఆర్ కలవనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్నారు కవిత. ఆమెను ప్రతి రోజూ సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులతోపాటు న్యాయవాదిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం గం. 6.00 నుంచి గం. 7.00 మధ్యలో కేటీఆర్ కలవడానికి అనుమతి లభించింది. కుటుంబ సభ్యుల్లో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో పాటు పీఏ శరత్, న్యాయవాది మోహిత్‌కు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు.

  • Srikar T
  • Updated on: Apr 14, 2024
  • 8:29 am

Delhi: లిక్కర్‌ కేసులో మరో ట్విస్ట్‌..! కవితను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన కవితకు కష్టాలు రెట్టింపయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో కవితను గురువారం అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఆమెను శుక్రవారం ఉదయం 10.00 గంటలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరుపరిచారు. 5 రోజుల పాటు కవితను సీబీఐ కస్టడీకి కోరారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు ప్రదేశాల్లో ఈ స్కామ్ కు సంబంధించిన సమావేశాలు జరిపినట్లు చెబుతోంది సీబీఐ.

  • Srikar T
  • Updated on: Apr 12, 2024
  • 11:29 am

MLC Kavitha: నేను చెప్పాల్సింది చెప్పా.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు..

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాల్టితో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ధర్మాసనం కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడగించింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది.

Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ నిరాకరణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బెయిల్ పిటీషన్ ను నిరాకరించింది. చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో కవిత బెయిల్‌ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు.

Delhi: కవిత కేసులో మరో మలుపు.. సీబీఐ విచారణపై కోర్టులో పిటిషన్..

ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణను వ్యతిరేకించారు. లిక్కర్ కేసులో అవినీతి కుంభకోణానికి పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో తనను తీహార్ జైలులోనే విచారించాలని ఢిల్లీ స్పెషల్ కోర్టును కోరింది సీబీఐ. శుక్రవారం సీబీఐకి ఢిల్లీలోని తిహార్ జైలుకే వెళ్లి విచారించాలని ఆదేశించింది కోర్టు.

  • Srikar T
  • Updated on: Apr 6, 2024
  • 3:39 pm

Delhi: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సీబీఐ విచారణకు ఆదేశించిన ఢిల్లీ కోర్టు..

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితను విచారించేందు సీబీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు కోర్టును అనుమతి కోరింది సీబీఐ. కోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో జైల్లోనే కవిత విచారణ జరగనుంది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది.

  • Srikar T
  • Updated on: Apr 5, 2024
  • 6:17 pm

MLC Kavitha: కవితకు జైల్లో జపమాల, స్పోర్ట్స్ షూ ఇచ్చేందుకు కోర్టు అనుమతి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో వాడివేడి వాదనుల జరిగాయి. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 4వ తేదీకి వాయిదా పడింది. కవితకు ఇంటి భోజనం, పుస్తకాలు, షూ అందించేందుకు కోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది.

ఢిల్లీ తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత.. అమెకు కల్పించే సౌకర్యాలివే..

ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆమెకు రిమాండ్ గడువు పొడిగిస్తూ ఢిల్లీ అవెన్యూ కోర్టు అదేశించింది. దీంతో ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. మొదటి రోజు తీహార్ జైలులో కవిత జైలు భోజనం చేశారని అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి.

  • Srikar T
  • Updated on: Apr 5, 2024
  • 5:57 pm

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత అరెస్టయ్యారు. ఈ కేసులో కవిత ఈడీ కస్టడి ఇవ్వాల్టి (మార్చి 26 2024) తో ముగిసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్, కస్టడీపై సుధీర్ఘ వాదనలు కొనసాగాయి.

Latest Articles