కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు. తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె ఆమె. భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో కీలక నాయకురాలైన ఆమె.. ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలిగా ఉన్నారు. 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్సభ సభ్యురాలిగా ప్రతినిథ్యంవహించారు. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. 2020 నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. బీ టెక్, ఎంఎస్ చదవుకున్న కె కవిత.. 2006లో భారత్కు తిరిగిరావడానికి ముందు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవారు. కవిత వ్యాపారవేత్త దేవనపల్లి అనిల్ కుమార్తో వివాహంకాగా.. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి కేసీఆర్తో కలిసి కె కవిత చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ కళలు, సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఆమె 2006లో తెలంగాణ జాగృతి సంస్థను నెలకొల్పారు. గతంలో బతుకమ్మ పండుకను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణతో పాటు విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కె కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను 2024 మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు.
Kavitha: వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్.. రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు..!
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎమ్మెల్సీ కవితకు వ్యక్తిగత రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.. అక్టోబర్ నుండి తన పని ప్రారంభించి, కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి వ్యూహరచన చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయి, సోషల్ మీడియాలో కవిత బలాన్ని పెంచేందుకు పీకే మార్గదర్శనం చేయనున్నారు. ఈ ఒప్పందం కవిత రాజకీయ భవిష్యత్తుకు కీలకమని పేర్కొంటున్నారు..
- Rakesh Reddy Ch
- Updated on: May 6, 2026
- 3:07 pm
తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు.. కవిత ‘టీఆర్ఎస్’.. బీజేపీ, బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే!
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం (ఏప్రిల్ 25) సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించి సంచలనం సృష్టించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగిన భారీ ఆవిర్భావ సభలో తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)గా ఆమె నామకరణం చేశారు.
- Balaraju Goud
- Updated on: Apr 25, 2026
- 12:56 pm
Kavitha Party: టీఆర్ఎస్.. పార్టీ పేరును ప్రకటించిన కవిత.. మునీరాబాద్ బహిరంగ సభ లైవ్ వీడియో
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ మునీరాబాద్లో జరిగిన బహిరంగ సభలో పార్టీ పేరు, జెండాను కవిత ఆవిష్కరించారు. పార్టీ పేరు టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత ప్రకటించారు. జెండాలో పసుపు నీలం ఆకుపచ్చ రంగులు ఉన్నాయి..
- Shaik Madar Saheb
- Updated on: Apr 25, 2026
- 11:12 am
Delhi Liquor Policy Case: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్ రిలీఫ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ CBI కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇతర నిందితులందరి పైన సిబిఐ నమోదు చేసిన కేసుల అన్నింటిని కొట్టివేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.
- Anand T
- Updated on: Feb 27, 2026
- 11:57 am
కొత్త పార్టీపై కే. కవిత కీలక ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ అంటే?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కల్వకుంట్ల కవిత పొలిటికల్ ఇంపాక్ట్ పరిమితంగానే ఉన్నా, భవిష్యత్లో మాత్రం పోటీఇవ్వగల సత్తా ఉందని నిరూపించుకున్నారు. దీంతో భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలకు కవిత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త పార్టీపై క్లారిటీ లేకుండానే మున్సిపల్ బరిలోకి దిగి బోణి కొట్టారు.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 19, 2026
- 7:35 pm
MLC Kavitha: ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ వేదికైంది.. మండలిలో ఎమ్మెల్సీ కవిత కన్నీళ్లు..
శాసనమండలిలో బీఆర్ఎస్పై కవిత మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తన రాజీనామా ఆమోదానికి ముందు మండలిలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన కవిత.. భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను ఎమ్మెల్సీ కవిత సమగ్రంగా వివరించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 5, 2026
- 1:48 pm
Raju Weds Rambai Movie: కల్వకుంట్ల కవితను కలిసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ టీమ్.. కారణమిదే..
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఇటీవలే రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా యూనిట్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సన్మానించి అభినందించింది.
- Basha Shek
- Updated on: Dec 18, 2025
- 7:16 pm
Kalvakuntla Kavitha: రామ్ చరణ్ గొప్ప డ్యాన్సరే కావొచ్చు.. కానీ.. తన ఫేవరేట్ హీరో ఎవరో చెప్పేసిన కవిత
నిత్యం ప్రజల్లో తిరుగుతోన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా #AskKavitha అంటూ ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఇదే సందర్భంగా ఒక నెటిజన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక ఆసక్తికర ప్రశ్న అడిగాడు.
- Basha Shek
- Updated on: Dec 15, 2025
- 8:37 pm
కవిత ఎమోషనల్గా నిర్ణయం తీసుకున్నారు.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఎమ్మెల్సీ స్థానానికి కవిత రాజీనామా చేసి రెండు వారాలు దాటింది.. మరి ఆమోదం ఎప్పుడు? అనే విషయంపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజీనామా ఆమోదించాలని ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారని.. ఎమోషనల్గా నిర్ణయం తీసుకున్నారు, పునరాలోచన చేసుకోవాలని చెప్పానన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 18, 2025
- 12:42 pm
తెలుగువాడైన సుదర్శన్ రెడ్డి గెలవాలి.. ఉపరాష్ట్రపతి ఎన్నికపై కవిత ఏమన్నారంటే..
బీఆర్ఎస్ నుంచి సస్పెండైన తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా కవిత తొలి నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్రెడ్డికి కవిత మద్దతు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది.. ఈ క్రమంలో.. కవిత కీలక ప్రకటన చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్రెడ్డి గెలవాలని కవిత ఆకాంక్షించారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 9, 2025
- 1:52 pm
KTR: ఒడిసిన ముచ్చట.. కవిత సస్పెన్షన్పై తొలిసారి స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే..
కవిత అంశం ఒడిసిన ముచ్చట.. ఆ టాపిక్ మళ్లీ తేవొద్దు అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక చర్చ అనవసరం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. అన్నీ చర్చించాకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 9, 2025
- 9:01 am
‘నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం..’ పార్టీ నిర్ణయం శిరోధార్యంః హరీష్ రావు
కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకున్న హరీష్.. ప్రజల కష్టాలపైనే తమ ఫోకస్ ఉంటుందని ఎయిర్పోర్టులో స్పందించారు. రాష్ట్ర సాధనలో నా నిబద్ధత, పాత్ర అందరికీ తెలిసిందే అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రెండున్నర దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉన్నానని, ఎవరి విషయంలోనైనా పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీకి కేసీఆరే సుప్రీం అని స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Sep 6, 2025
- 7:16 am