
కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు. తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె ఆమె. భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో కీలక నాయకురాలైన ఆమె.. ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలిగా ఉన్నారు. 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్సభ సభ్యురాలిగా ప్రతినిథ్యంవహించారు. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. 2020 నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. బీ టెక్, ఎంఎస్ చదవుకున్న కె కవిత.. 2006లో భారత్కు తిరిగిరావడానికి ముందు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవారు. కవిత వ్యాపారవేత్త దేవనపల్లి అనిల్ కుమార్తో వివాహంకాగా.. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి కేసీఆర్తో కలిసి కె కవిత చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ కళలు, సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఆమె 2006లో తెలంగాణ జాగృతి సంస్థను నెలకొల్పారు. గతంలో బతుకమ్మ పండుకను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణతో పాటు విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కె కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను 2024 మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు.
KCR: అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్.. ఆ భవన్కు వెళ్లింది ఇద్దరే.. కాళేశ్వరంపై ముగిసిన న్యాయ విచారణ..
కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కేసీఆర్ను వన్ టు వన్ విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. పలు కీలక వివరాలను అడిగి తెలుసుకుంది. మధ్యాహ్నం 12గంటలకు మొదలైన కేసీఆర్ విచారణ.. 50 నిమిషాల పాటు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్కు కమిషన్ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 11, 2025
- 1:50 pm
KCR: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్.. లైవ్ వీడియో
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కమిషన్ విచారించనుంది.. బూర్గుల రామకృష్ణారావు భవన్ (బీఆర్కే) లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభంకానుంది. క్రాస్ ఎగ్జామిన్ లో కమిషన్ పలు కీలక వివరాలను అడిగి తెలుసుకోనుంది. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 11, 2025
- 11:07 am
Rajiv Yuva Vikasam: పండగే పండగ.. రేపటినుంచే రాజీవ్ యువ వికాసం రుణ మంజూరు పత్రాలు అందజేత..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2 నుంచి రుణ మంజూరు పత్రాలు జారీచేయడానికి కాంగ్రెస్ సర్కార్ ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియను జూన్ 9వరకు కొనసాగించనుంది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 1, 2025
- 12:08 pm
Kavitha: మొన్న లెటర్ లీక్.. నిన్న చిట్చాట్ టాక్.. కారు పార్టీలో కల్లోలం.. కాంగ్రెస్, బీజేపీ రియాక్షన్ ఇదే..
గులాబీదళమంతా బతుకమ్మలా నెత్తిన పెట్టుకున్న కవితమ్మ పొలిటికల్ సిరీస్ కంటిన్యూ అవుతోంది...! ఓవైపు లెటర్ లీక్... మరోవైపు చిట్చాట్ టాక్తో థ్రిల్లర్తో కూడా పొలిటికల్ డ్రామా నడుస్తోంది..! కవిత ఎపిసోడ్లో కుటుంబ విభేదాలు, నాయకత్వ అంశాలను పక్కనపెడితే.. సెకెండ్ టార్గెట్ కమలంపార్టీనే చేసినట్లు కనిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతోందని డే-వన్ నుంచి దరువేస్తోంది కవిత. మరీ విలీనం వ్యవహారాన్ని కమలంపార్టీ ఎలా చూస్తోంది..? కారుపార్టీ ఏమంటోంది..? అన్నీ గమనిస్తున్న హస్తంపార్టీ రియాక్షన్ ఏంటి..?
- Shaik Madar Saheb
- Updated on: May 31, 2025
- 9:51 am
Kavitha – KCR: మై డియర్ డాడీ.. కేసీఆర్ను ప్రశ్నిస్తూ కవిత సంచలన లేఖ..
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రశ్నిస్తూ ఆమె కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. కొన్ని పాజిటివ్ విషయాలు చెబుతూనే పలు నెగిటివ్ అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు కవిత. పార్టీ లీడర్స్కి యాక్సెస్ ఇవ్వడం లేదని పేర్కొన్న కవిత.. వరంగల్ సభ స్పీచ్లో మరింత పంచ్ ఉండాల్సిందని లేఖలో ప్రస్తావించారు.
- Shaik Madar Saheb
- Updated on: May 22, 2025
- 7:39 pm
AP-Telangana Politics: బుక్ చేస్తాం ఖబడ్దార్.. ఆ రెండిటి చుట్టూ ఏపీ, తెలంగాణలో రసవత్తర రాజకీయాలు..
తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. బుక్స్ మెయింటెయిన్ చేస్తున్నాం బుక్ చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు విపక్షనేతలు. ఏపీలో రెడ్బుక్ పాలనకు జగనన్న 2.0 సర్కార్లో రివేంజ్ ఉంటుందని వైసీపీ అధినేత ప్రకటించారు. అయితే ఈ బుక్కుల గోల తెలంగాణకు కూడా పాకింది. తమ కార్యకర్తలను వేధిస్తున్నవారి పేర్లను పింక్ బుక్లో ఎక్కిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది.
- Shaik Madar Saheb
- Updated on: Feb 14, 2025
- 8:26 pm
MLC Kavitha: మళ్లీ యాక్టీవ్ అవుతున్నారా?.. ఆసక్తికరంగా ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీ ఎంట్రీ
పొలిటికల్గా ఆమె రీ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్రీ.. ఇప్పుడిదే అంశం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు కారణమవుతోంది. రాజకీయంగా ఆమె ఎత్తుగడలేంటి? ముఖ్యమంత్రి ముచ్చట వెనక మతలబేంటి?.. ఓ లుక్కెయ్యండి..
- Shaik Madar Saheb
- Updated on: Nov 25, 2024
- 9:44 pm
Delhi: కవితకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. బెయిల్ విచారణ అప్పుడే..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న కవిత స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అసుపత్రిలో చికిత్స అందించారు. తీవ్రమైన జ్వరంతో పాటూ, గైనిక్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు జైలు అధికారులు. చికిత్స నిమిత్తం మంగళవారం సాయంత్రం 4 గంటలకు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించినట్లు వెల్లడించారు.
- Srikar T
- Updated on: Jul 16, 2024
- 10:42 pm
Delhi: కవిత లిక్కర్ కేసుపై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరులో జాప్యం అందుకేనా..
లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కష్టాలు తీరట్లేదు. దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్పై విచారణ 22కి వాయిదా వేసింది కోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారు కవిత. విచారణ జరిపిన కోర్టు.. కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై పరిశీలించింది.
- Srikar T
- Updated on: Jul 13, 2024
- 7:45 am
Delhi: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు కస్టడీ పొడిగింపు.. చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ..
ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జ్షీట్లో సంచలన విషయాలు వెల్లడించింది. లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ పేరుతో ఆప్కు రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించినట్టు తెలిపింది. ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు జులై 3వ తేదీ వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు.
- Srikar T
- Updated on: Jun 3, 2024
- 9:31 pm