AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు. తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె ఆమె. భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో కీలక నాయకురాలైన ఆమె.. ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలిగా ఉన్నారు. 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలిగా ప్రతినిథ్యంవహించారు. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. 2020 నుంచి ఎమ్మెల్సీ‌గా పనిచేస్తున్నారు. బీ టెక్, ఎంఎస్ చదవుకున్న కె కవిత.. 2006లో భారత్‌కు తిరిగిరావడానికి ముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. కవిత వ్యాపారవేత్త దేవనపల్లి అనిల్ కుమార్‌తో వివాహంకాగా.. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి కేసీఆర్‌తో కలిసి కె కవిత చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ కళలు, సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఆమె 2006లో తెలంగాణ జాగృతి సంస్థను నెలకొల్పారు. గతంలో బతుకమ్మ పండుకను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణతో పాటు విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కె కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను 2024 మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు.

ఇంకా చదవండి

కవిత ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకున్నారు.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఎమ్మెల్సీ స్థానానికి కవిత రాజీనామా చేసి రెండు వారాలు దాటింది.. మరి ఆమోదం ఎప్పుడు? అనే విషయంపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజీనామా ఆమోదించాలని ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారని.. ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకున్నారు, పునరాలోచన చేసుకోవాలని చెప్పానన్నారు.

తెలుగువాడైన సుదర్శన్ రెడ్డి గెలవాలి.. ఉపరాష్ట్రపతి ఎన్నికపై కవిత ఏమన్నారంటే..

బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా కవిత తొలి నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్‌ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి కవిత మద్దతు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉంది.. ఈ క్రమంలో.. కవిత కీలక ప్రకటన చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలవాలని కవిత ఆకాంక్షించారు.

KTR: ఒడిసిన ముచ్చట.. కవిత సస్పెన్షన్‌పై తొలిసారి స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే..

కవిత అంశం ఒడిసిన ముచ్చట.. ఆ టాపిక్‌ మళ్లీ తేవొద్దు అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక చర్చ అనవసరం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. అన్నీ చర్చించాకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు.

‘నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం..’ పార్టీ నిర్ణయం శిరోధార్యంః హరీష్‌ రావు

కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకున్న హరీష్‌.. ప్రజల కష్టాలపైనే తమ ఫోకస్‌ ఉంటుందని ఎయిర్‌పోర్టులో స్పందించారు. రాష్ట్ర సాధనలో నా నిబద్ధత, పాత్ర అందరికీ తెలిసిందే అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రెండున్నర దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉన్నానని, ఎవరి విషయంలోనైనా పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీకి కేసీఆరే సుప్రీం అని స్పష్టం చేశారు.

Revanth Reddy: మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..

ఎవరో వెనక నేనెందుకు ఉంటాను.. నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను.. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను.. నాకు అంత సమయంలేదు.. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అంటూ కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు.. ఇప్పుడు పంచాయితీలు పెట్టుకుంటున్నారు.. అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

కవిత కొన్ని కఠోర సత్యాలు మాట్లాడారు.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

పీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్ గౌడ్ కవిత వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్‌ బిడ్డ కవిత స్టాండ్‌ ఎందుకు మారిందో అర్ధం కావడం లేదు అంటూ పేర్కొన్నారు. కేటీఆర్‌ విషయంలో ఆమె మాట మార్చిందన్నారు. బాణం హరీష్‌రావుపైకి ఎందుకు తిరిగిందో తెలియడం లేదని మహేష్‌గౌడ్‌ చెప్పుకొచ్చారు. ఆమె మాటలు వింటే కవిత కేసీఆర్‌ విడిచిన బాణం అనకుంటున్నామని మహేష్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

Kavitha: ఆరడుగుల బుల్లెట్‌ నాకు గాయం చేసింది.. తర్వాత మీవంతే రామన్న..

రామన్నా.. హరీష్‌, సంతోష్‌ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది.. అంటూ కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మాట్లాడారు.. మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి హరీష్‌రావు, అలాగే.. సంతోష్ రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు.

నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది.. రామన్న వారితో జాగ్రత్త.. కవిత సంచలన వ్యాఖ్యలు..

నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది.. నేను కూడా మీలాగే ముఖం మీద మాట్లాడుతా.. అంటూ కేసీఆర్ కూతురు కవిత పేర్కొన్నారు. జన్మనిచ్చిన తండ్రి చిటికన వేలు పట్టుకుని ఉద్యమం చేయడం నేర్చుకున్నా.. నాపై ఇద్దరు పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

K Kavitha: నాన్న, రామన్న వారితో జాగ్రత్త.. హరీష్‌రావు, సంతోష్‌ ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా: కవిత

సామాజిక తెలంగాణకోసమే కేసీఆర్‌ పోరాడారని, ఆయన వేలుపట్టుకుని తాను ఓనమాలు నేర్చుకున్నానన్నారు కవిత. సామాజిక తెలంగాణ అనే పదమే పార్టీ వ్యతిరేకమన్నట్లు కొందరు మాట్లాడుతున్నారన్నారు. సామాజిక తెలంగాణ వద్దా.. భౌగోళిక తెలంగాణ సరిపోతుందా అంటూ పార్టీలో తనపై ప్రచారం చేస్తున్నవారిని సూటిగా ప్రశ్నించారు కవిత.

కవిత గురించి ఆలోచిస్తాం.. బీఆర్‌ఎస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

కవితకు నేను టార్గెట్‌ అయ్యానని అనుకోవట్లేదు.. తన వ్యాఖ్యలకు కవిత చింతించి ఉంటారని అనుకుంటున్నా.. ఆమె గురించి కేసీఆర్‌తో ఎప్పుడూ చర్చించలేదు.. పార్టీలో ఇబ్బంది ఉంటే, మేమే చూసుకుంటాం.. అంటూ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. 25ఏళ్లలో తానెవర్నీ వ్యక్తిగతంగా దూషించలేదని.. KCRపై ఆఫ్‌ ది రికార్డ్ విమర్శలు చేసినా తట్టుకోలేను.. అంటూ వ్యాఖ్యానించారు.