రాకేష్ రెడ్డి చాపల, టీవీ9 తెలుగులో పొలిటికల్ బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు. మొదట సాక్షి మీడియా గ్రూపులో పనిచేసిన రాకేష్… గత 12 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తారు . దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. 2014 – 15 సంవత్సరాలలో రెండు NT అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్రస్థాయిలోనూ అనేక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులను అందుకున్నారు.
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను పాలిస్తోంది రేవంత్ రెడ్డి కాదని, చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ ఆంధ్ర పెత్తందారుల చేతిలోకి వెళ్ళిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఫేక్ స్పీచ్ బిల్లు తెచ్చారని విమర్శించారు.
- Rakesh Reddy Ch
- Updated on: Mar 31, 2026
- 8:26 pm
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. ఏపీ నీళ్లను దోచుకెళ్ళాక ఇప్పుడు ధర్నా చేయడం అనవసరమని, ఇది కేవలం డ్రామా అని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, తక్షణమే ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
- Rakesh Reddy Ch
- Updated on: Mar 31, 2026
- 8:20 pm
Hyderabad: హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్లు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..
తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్యూచర్ సిటీ పరిధిలో ఈ ప్రాజెక్టు కోసం 500 ఎకరాలు కేటాయించనుంది. దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయితే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు కేంద్రం బుల్లెట్ రైళ్లను ప్రతిపాదించింది.
- Rakesh Reddy Ch
- Updated on: Mar 31, 2026
- 4:39 pm
KTR: రూ.1400కోట్ల విలువైన భూమిపై పొంగులేటి కన్ను పడింది
కే. టి. రామారావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో రూ.1400 కోట్ల విలువైన భూమిపై పొంగులేటి కన్ను పడిందని తెలిపారు. బాధితులైన సతీష్ షా, పల్లవి షా కుటుంబం తమ 27 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కునేందుకు అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
- Rakesh Reddy Ch
- Updated on: Mar 30, 2026
- 11:23 pm
KTR: మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ దోపిడీకి పాల్పడుతున్నారు
బీఆర్ఎస్ నేత కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో ₹1400 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మైనింగ్, నిషేధిత భూముల దోపిడీ జరుగుతోందని, ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.
- Rakesh Reddy Ch
- Updated on: Mar 30, 2026
- 11:18 pm
KTR: CBCID ని అడ్డం పెట్టుకుని పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేశారు
పొంగులేటి అవినీతిపై హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీబీసీఐడీని అడ్డుపెట్టుకొని పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, వందల కోట్ల ప్రజా సంపదను ఆయన కుటుంబ కంపెనీ కొల్లగొడుతోందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రే తప్పును అంగీకరించినప్పటికీ, మంత్రిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
- Rakesh Reddy Ch
- Updated on: Mar 30, 2026
- 7:22 pm
అమెజాన్ నుంచి ఏఐ ‘ట్రాన్స్ఫార్మర్’ ఫోన్! ఆపిల్, శాంసంగ్లకు చెక్ పెట్టేలా సరికొత్త వ్యూహం.. పాత పరాభవానికి రివెంజ్ ఖాయమా?
స్మార్ట్ఫోన్ రంగంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. పదేళ్ల క్రితం ఎదురైన చేదు అనుభవాలను పక్కనపెట్టి, ఈసారి పూర్తి ఏఐ (AI) సాంకేతికతతో కూడిన ఫోన్ను సిద్ధం చేస్తోంది. 2014లో 'ఫైర్ ఫోన్' విఫలమవ్వడంతో ఎదురైన భారీ నష్టాల తర్వాత, అమెజాన్ మళ్ళీ స్మార్ట్ఫోన్ రేసులోకి రావడం ఇదే మొదటిసారి. ఈ కొత్త ఫోన్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇక్కడ ఉన్నాయి..
- Rakesh Reddy Ch
- Updated on: Mar 21, 2026
- 12:03 pm
మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఐదు రోజుల గ్రాండ్ సెలబ్రేషన్స్!
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు సత్యనారాయణస్వామి వ్రతంతో శ్రీకారం చుట్టబోతున్నారు. మార్చి 19న గ్రాండ్గా పెళ్లి జరగబోతోంది. అయితే.. ఈ పెళ్లి.. మల్లారెడ్డి కొడుకుదో.. కూతురుదో.. మనవళ్లు, మనవరాళ్లదో అనుకునేరు.. కాదండోయ్... స్వయంగా మల్లారెడ్డే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు..
- Rakesh Reddy Ch
- Updated on: Mar 11, 2026
- 9:11 am
KTR: న్యాయం అడిగితే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులా ??
ఆదిలాబాద్ జైల్లో సుమన్ను పరామర్శించిన కేటీఆర్, తెలంగాణ డీజీపీకి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను దుర్భాషలాడిన కాంగ్రెస్, బీజేపీ నేతలపై కేసులు లేవని, న్యాయం కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపైనే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. క్యాథన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై అధికార యంత్రాంగం కుమ్మక్కైందని ఆరోపించారు.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 24, 2026
- 9:00 pm
మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా.. ఈ చిన్న టెక్నిక్తో చెక్ పెట్టండి..
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన ప్రాణం కంటే ఎక్కువైపోయింది. మన బ్యాంక్ ఖాతా వివరాల నుండి పర్సనల్ మెసేజ్ల వరకు అన్నీ అందులోనే ఉంటాయి. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, సైబర్ నేరగాళ్లు మన కళ్లు గప్పి మన ఫోన్ను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. మీరు చేసే ఒక చిన్న ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్తోనే మీ అకౌంట్ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 24, 2026
- 7:10 pm
Telangana: డబ్బులు కట్టి గోల్డ్ విడిపిద్దామని బ్యాంక్కు వచ్చాడు.. తీరా నగలు పరిశీలించగా
బాధితుడు కట్టా అనే వ్యక్తి సికింద్రాబాద్ లోని సింధ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన జోసెఫ్ తన వ్యక్తిగత అవసరాల కోసం 2025 జనవరి 29న గోల్డ్ లోన్ లో తన బంగారు ఆభరణాలను ఇండియన్ బ్యాంక్ సింధ్ కాలనీ బ్రాంచ్లో కుదువ పెట్టాడు.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 23, 2026
- 9:11 pm
మీ ఫోటోలు మార్ఫింగ్ చేశారా.. ఆన్లైన్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ ఒక్క స్టెప్తో ఫుల్ సేఫ్..!
సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడం ఇప్పుడు చాలా కామన్. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వారికి కనీసం 10 ఫొటోలైన అప్లోడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఫోటోని ఉపయోగించి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతామంటూ బెదిరించే సైబర్ క్రైమ్ కేసులను రోజు చూస్తూనే ఉంటాం.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 20, 2026
- 8:32 pm