రాకేష్ రెడ్డి చాపల, టీవీ9 తెలుగులో పొలిటికల్ బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు. మొదట సాక్షి మీడియా గ్రూపులో పనిచేసిన రాకేష్… గత 12 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తారు . దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. 2014 – 15 సంవత్సరాలలో రెండు NT అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్రస్థాయిలోనూ అనేక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులను అందుకున్నారు.
రేయ్ ఏంట్రా ఇది.. ఉత్తుత్తి కోర్టు పెట్టి తీర్పులు కూడా ఇచ్చేశారు.. కట్ చేస్తే..
Gujarat Fake Court Scam: గుజరాత్లో గాంధీనగర్ కేంద్రంగా ఒక ముఠా ఏకంగా ‘నకిలీ కోర్టు’నే ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసిన ఘటన దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మోరిస్ శామ్యూల్ అనే వ్యక్తి నాయకత్వంలో నడిచిన ఈ ముఠా, ప్రజల అమాయకత్వాన్ని, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఉపయోగించుకుని ఈ దందాను సాగించింది. నిజమైన కోర్టుల మాదిరిగానే వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు.
- Rakesh Reddy Ch
- Updated on: Apr 23, 2026
- 6:18 pm
Viral News: బ్లాక్ మార్కెట్లో కోట్లు కురిపిస్తున్న చిట్టి చీమలు.. వీటితో ఏం చేస్తారో తెలిస్తే..
వన్యప్రాణుల స్మగ్లింగ్ అనగానే మనకు పులులు, ఏనుగు దంతాలు, అరుదైన పక్షులు, పాములు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు అంతర్జాతీయ స్మగ్లర్ల కన్ను చిన్న చీమలపై పడింది. అరుదైన ఆఫ్రికన్ రాణి చీమల అక్రమ రవాణా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇది వైల్డ్లైఫ్ ట్రాఫికింగ్లో వస్తున్న ఒక సరికొత్త, ప్రమాదకరమైన పరిణామంగా నిపుణులు చెబుతున్నారు.
- Rakesh Reddy Ch
- Updated on: Apr 18, 2026
- 5:47 pm
Car Door: మీ కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే మీ ప్రాణాలకు ముప్పే!
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కార్ల డిజైన్లలో కొత్త మార్పులు వస్తున్నాయి. అయితే ఈ అత్యాధునిక ఫీచర్లు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని పెంచేందుకు తీసుకొస్తున్న టెక్నాలజీల వల్లే ప్రమాదాల తీవ్రత కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లలో ఉండే 'హిడెన్ డోర్ హ్యాండిల్స్' వల్ల చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. కారు అన్-లాక్ చేసినప్పుడు మాత్రమే ఇవి బయటకు వస్తాయి. ఈ డిజైన్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భద్రతాపరంగా మాత్రం ప్రమాదమే అంటున్నారు నిపుణులు.
- Rakesh Reddy Ch
- Updated on: Apr 17, 2026
- 3:52 pm
ఐఏఎస్ క్వార్టర్స్లో ‘డాగ్ ఫైట్’.. పెంపుడు కుక్క చిచ్చు.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అధికారులు!
హైదరాబాద్ మహానగరంలోనే అత్యంత విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఐఏఎస్ క్వార్టర్స్ బుధవారం (ఏప్రిల్ 15) ఒక హైడ్రామా చోటు చేసుకుంది. సమాజంలో అత్యున్నత హోదాల్లో ఉండి, వేలాది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఐఏఎస్ అధికారుల మధ్య ఒక చిన్న 'పెంపుడు కుక్క' వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది.
- Rakesh Reddy Ch
- Updated on: Apr 15, 2026
- 5:46 pm
Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..
పిల్లాడిని ఇరవై ఒక్క ఏళ్ల వయసు వరకు పెంచి పెద్ద చేయడానికి ఏకంగా రూ.1.83 కోట్లు ఖర్చవుతుందన్న అంచనాలు దేశవ్యాప్తంగా దంపతులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ భారీ వ్యయాన్ని తట్టుకోలేక చాలామంది యువ దంపతులు పిల్లలను కనే ఆలోచనను పూర్తిగా పక్కన పెడుతున్నారు.
- Rakesh Reddy Ch
- Updated on: Apr 13, 2026
- 1:44 pm
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
Fake cream in biscuits in Telugu: ఇలాంటి నకిలీ క్రీమ్ బిస్కెట్లను పిల్లలకు తినిపించడం వల్ల ఊబకాయం తదితర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పామాయిల్, వెజిటబుల్ ఫ్యాట్స్ ఎక్కువగా శరీరంలోకి వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వైద్యులు సైతం వార్నింగ్ ఇస్తున్నారు.
- Rakesh Reddy Ch
- Updated on: Apr 11, 2026
- 1:56 pm
Hyderabad: 2300 ఏళ్ల క్రితం ఈజిప్ట్లో శ్వాస ఆగిన యువతి.. భాగ్యనగరానికి ఎలా వచ్చిందబ్బా..!
హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, నిజాం వారసత్వం గుర్తుకు వస్తాయి. కానీ నగరం గుండెల్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ప్రపంచ చరిత్రను మోస్తున్న ఒక అరుదైన అవశేషం నిశ్శబ్దంగా పడి ఉంది. అదే 2300 ఏళ్ల క్రితం ఈజిప్ట్లో శ్వాస ఆగిన ఒక యువతి మమ్మీ. భారతదేశంలో ఉన్న అరుదైన ఆరు ఈజిప్ట్ మమ్మీలలో ఇది ఒకటి కావడం దీని ప్రత్యేకత.
- Rakesh Reddy Ch
- Updated on: Apr 7, 2026
- 5:52 pm
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను పాలిస్తోంది రేవంత్ రెడ్డి కాదని, చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ ఆంధ్ర పెత్తందారుల చేతిలోకి వెళ్ళిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఫేక్ స్పీచ్ బిల్లు తెచ్చారని విమర్శించారు.
- Rakesh Reddy Ch
- Updated on: Mar 31, 2026
- 8:26 pm
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. ఏపీ నీళ్లను దోచుకెళ్ళాక ఇప్పుడు ధర్నా చేయడం అనవసరమని, ఇది కేవలం డ్రామా అని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, తక్షణమే ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
- Rakesh Reddy Ch
- Updated on: Mar 31, 2026
- 8:20 pm
Hyderabad: హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్లు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..
తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్యూచర్ సిటీ పరిధిలో ఈ ప్రాజెక్టు కోసం 500 ఎకరాలు కేటాయించనుంది. దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయితే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు కేంద్రం బుల్లెట్ రైళ్లను ప్రతిపాదించింది.
- Rakesh Reddy Ch
- Updated on: Mar 31, 2026
- 4:39 pm
KTR: రూ.1400కోట్ల విలువైన భూమిపై పొంగులేటి కన్ను పడింది
కే. టి. రామారావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో రూ.1400 కోట్ల విలువైన భూమిపై పొంగులేటి కన్ను పడిందని తెలిపారు. బాధితులైన సతీష్ షా, పల్లవి షా కుటుంబం తమ 27 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కునేందుకు అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
- Rakesh Reddy Ch
- Updated on: Mar 30, 2026
- 11:23 pm
KTR: మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ దోపిడీకి పాల్పడుతున్నారు
బీఆర్ఎస్ నేత కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో ₹1400 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మైనింగ్, నిషేధిత భూముల దోపిడీ జరుగుతోందని, ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.
- Rakesh Reddy Ch
- Updated on: Mar 30, 2026
- 11:18 pm