రాకేష్ రెడ్డి చాపల, టీవీ9 తెలుగులో పొలిటికల్ బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు. మొదట సాక్షి మీడియా గ్రూపులో పనిచేసిన రాకేష్… గత 12 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తారు . దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. 2014 – 15 సంవత్సరాలలో రెండు NT అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్రస్థాయిలోనూ అనేక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులను అందుకున్నారు.
మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఐదు రోజుల గ్రాండ్ సెలబ్రేషన్స్!
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు సత్యనారాయణస్వామి వ్రతంతో శ్రీకారం చుట్టబోతున్నారు. మార్చి 19న గ్రాండ్గా పెళ్లి జరగబోతోంది. అయితే.. ఈ పెళ్లి.. మల్లారెడ్డి కొడుకుదో.. కూతురుదో.. మనవళ్లు, మనవరాళ్లదో అనుకునేరు.. కాదండోయ్... స్వయంగా మల్లారెడ్డే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు..
- Rakesh Reddy Ch
- Updated on: Mar 11, 2026
- 9:11 am
KTR: న్యాయం అడిగితే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులా ??
ఆదిలాబాద్ జైల్లో సుమన్ను పరామర్శించిన కేటీఆర్, తెలంగాణ డీజీపీకి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను దుర్భాషలాడిన కాంగ్రెస్, బీజేపీ నేతలపై కేసులు లేవని, న్యాయం కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపైనే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. క్యాథన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై అధికార యంత్రాంగం కుమ్మక్కైందని ఆరోపించారు.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 24, 2026
- 9:00 pm
మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా.. ఈ చిన్న టెక్నిక్తో చెక్ పెట్టండి..
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన ప్రాణం కంటే ఎక్కువైపోయింది. మన బ్యాంక్ ఖాతా వివరాల నుండి పర్సనల్ మెసేజ్ల వరకు అన్నీ అందులోనే ఉంటాయి. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, సైబర్ నేరగాళ్లు మన కళ్లు గప్పి మన ఫోన్ను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. మీరు చేసే ఒక చిన్న ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్తోనే మీ అకౌంట్ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 24, 2026
- 7:10 pm
Telangana: డబ్బులు కట్టి గోల్డ్ విడిపిద్దామని బ్యాంక్కు వచ్చాడు.. తీరా నగలు పరిశీలించగా
బాధితుడు కట్టా అనే వ్యక్తి సికింద్రాబాద్ లోని సింధ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన జోసెఫ్ తన వ్యక్తిగత అవసరాల కోసం 2025 జనవరి 29న గోల్డ్ లోన్ లో తన బంగారు ఆభరణాలను ఇండియన్ బ్యాంక్ సింధ్ కాలనీ బ్రాంచ్లో కుదువ పెట్టాడు.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 23, 2026
- 9:11 pm
మీ ఫోటోలు మార్ఫింగ్ చేశారా.. ఆన్లైన్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ ఒక్క స్టెప్తో ఫుల్ సేఫ్..!
సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడం ఇప్పుడు చాలా కామన్. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వారికి కనీసం 10 ఫొటోలైన అప్లోడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఫోటోని ఉపయోగించి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతామంటూ బెదిరించే సైబర్ క్రైమ్ కేసులను రోజు చూస్తూనే ఉంటాం.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 20, 2026
- 8:32 pm
కొత్త పార్టీపై కే. కవిత కీలక ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ అంటే?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కల్వకుంట్ల కవిత పొలిటికల్ ఇంపాక్ట్ పరిమితంగానే ఉన్నా, భవిష్యత్లో మాత్రం పోటీఇవ్వగల సత్తా ఉందని నిరూపించుకున్నారు. దీంతో భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలకు కవిత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త పార్టీపై క్లారిటీ లేకుండానే మున్సిపల్ బరిలోకి దిగి బోణి కొట్టారు.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 19, 2026
- 7:35 pm
Actress Pratyusha: హీరోయిన్ ప్రత్యూష హత్య కేసులో రేపే తుది తీర్పు.. జడ్జిమెంట్పై నెలకొన్న ఉత్కంఠ!
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సినీ నటి, హీరోయిన్ ప్రత్యూష అత్యాచారం, మర్డర్ కేసులో మంగళవారం సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. 2002లో జరిగిన ఈ హత్య కేసులో సుమారు 24 ఏళ్ల విచారణ తర్వాత మంగళవారం కోర్టు తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి కోర్టు శిక్షను పెంచుతుందా లేదా అన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 16, 2026
- 8:55 pm
మల్లారెడ్డి యూనివర్సిటీలో శివరాత్రి జాగరణ కార్యక్రమం
మల్లారెడ్డి యూనివర్సిటీలో మహాశివరాత్రి సందర్భంగా భారీ జాగరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలు, వ్యాపారంతో పాటు ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించడం చర్చనీయాంశమైంది. 50 వేల మందితో సద్గురు శైలిలో సెట్టింగ్ వేసి ఈ వేడుకను జరిపారు. ఆయన ఆధ్యాత్మిక మార్పు మేడ్చల్లో హాట్ టాపిక్గా మారింది.
- Rakesh Reddy Ch
- Updated on: Feb 13, 2026
- 4:28 pm
కొండెక్కిన బంగారం, వెండి ధరలు క్రాష్.. ఎందుకు దిగివస్తున్నాయంటే..?
బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో మార్జిన్ పెంపు ఊహాగానాలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేశాయి. లాభాల బుకింగ్ తో విలువైన లోహాలపై ఒత్తిడి పెరిగి, COMEX బంగారం ధర ఒక్క రోజులోనే 11 శాతానికి పైగా పడిపోయింది.
- Rakesh Reddy Ch
- Updated on: Jan 31, 2026
- 5:30 pm
Harish Rao: ఢిల్లీ మీటింగ్ను బహిష్కరించండి.. హరీష్ రావు డిమాండ్
హరీష్ రావు తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డీపీఆర్లను వెనక్కి తెచ్చుకుందని, నల్లమల సాగర్ అనుమతులపై స్పష్టత లేకుండా సమావేశానికి హాజరవడం తెలంగాణకు ద్రోహం అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
- Rakesh Reddy Ch
- Updated on: Jan 30, 2026
- 6:40 pm
KCR: సిట్ నోటీసుల వేళ.. పొలం బాట పట్టిన కేసీఆర్
సిట్ నోటీసుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. తనకు మరోసారి నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఫామ్హౌస్కే పంపించాలని ఆయన సూచించారు. అయితే, సిట్ అధికారులు నోటీసులను నందినగర్లోని ఆయన నివాసానికి పంపారు. కేసీఆర్ ప్రస్తుతం తన పొలాలను పరిశీలిస్తున్నారు.
- Rakesh Reddy Ch
- Updated on: Jan 30, 2026
- 6:38 pm
ఈ హోటల్స్కు వెళ్తే మీ ఫోన్ బాస్కెట్లో వెయ్యాల్సిందే.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..
ఒకప్పుడు రెస్టారెంట్ అంటే ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆహారాన్ని ఆస్వాదించే వేదిక. కానీ నేడు అది కాస్తా డిజిటల్ స్టూడియోగా మారిపోయింది. ప్లేటులో ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోకముందే ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ ఫోటోలతో బిజీ అయిపోతున్నారా.. అయితే వీటికి చెక్ పెట్టేందుకు పలు రెస్టారెంట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Rakesh Reddy Ch
- Updated on: Jan 26, 2026
- 6:14 pm