Weather Alert: తెలుగు ప్రజలకు అలెర్ట్.. ఈ నెల 15 వరకూ భానుడు భగభగలు.. ఎండలతో జాగ్రత్త అంటున్న నిపుణులు

Weather Alert: తెలుగు రాష్ట్రాల(Telugu States) తో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana)ల్లో ఏప్రిల్ తొలి 15 రోజుల్లో భానుడు భగభగమంటాడని..

Weather Alert: తెలుగు ప్రజలకు అలెర్ట్.. ఈ నెల 15 వరకూ భానుడు భగభగలు.. ఎండలతో జాగ్రత్త అంటున్న నిపుణులు
Summer Heat In Telangana
Follow us

|

Updated on: Apr 06, 2022 | 8:47 AM

Weather Alert: తెలుగు రాష్ట్రాల(Telugu States) తో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana)ల్లో ఏప్రిల్ తొలి 15 రోజుల్లో భానుడు భగభగమంటాడని.. పలు ప్రాంతాల్లో ఎండలతో పాటు, వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాలోని ప్రజలు ఉదయం  11 గంటల నుంచి సాయంత్రం 5 మధ్య బయటకు వెళ్లొద్దని వాతావరణ నిపుణుల సూచిస్తున్నారు. ఏప్రిల్ తొలి 15 రోజుల పాటు ఎండలు మండిపోయే అవకాశముందని తెలిపారు. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 15 వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. దేశంలో పలు ప్రాంతాలతో పాటు.. హిమాలయ పర్వతాల్లోనూ ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని స్పష్టం చేసింది ఐఎండీ. ఇలాంటి వాతావరణంలో ఎక్కువగా అడవుల్లో కార్చిచ్చు ఏర్పడే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

రికార్డ్ బద్దలు: మరో వైపు మార్చి నుంచే మండిపోతున్న ఎండలు దశాబ్దాల రికార్డులను బద్దలు కొడుతున్నాయి. . 1901 తర్వాత ఈ మార్చిలో అంటే 122 ఏళ్ల తర్వాత దేశంలో మార్చి నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సరాసరి 33.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో 2010లో నమోదైన 33.09 డిగ్రీల రికార్డు చెరిగిపోయింది.

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన: ఎండలతో , ఉక్కబోతతో, వడగాల్పులతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మర‌ఠ్వాడా నుంచి క‌ర్ణాట‌క మీదుగా త‌మిళ‌నాడు వ‌ర‌కు విస్తరించి ఉన్న ద్రోణి కార‌ణంగా రాష్ట్రంలో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోని కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ, తెలంగాణాలో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెద‌క్, సంగారెడ్డి, న‌ల్లగొండ‌, సూర్యాపేట జిల్లాల సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో నేడు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

Also Read: Chanakya Niti: మనిషి సంతోషంగా ఉండాలన్నా.. సక్సెస్ అందుకోవాలన్నా.. ఈ 4 విషయాలను గుర్తుంచుకోమన్న చాణక్య

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..