AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: తెలుగు ప్రజలకు అలెర్ట్.. ఈ నెల 15 వరకూ భానుడు భగభగలు.. ఎండలతో జాగ్రత్త అంటున్న నిపుణులు

Weather Alert: తెలుగు రాష్ట్రాల(Telugu States) తో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana)ల్లో ఏప్రిల్ తొలి 15 రోజుల్లో భానుడు భగభగమంటాడని..

Weather Alert: తెలుగు ప్రజలకు అలెర్ట్.. ఈ నెల 15 వరకూ భానుడు భగభగలు.. ఎండలతో జాగ్రత్త అంటున్న నిపుణులు
Summer Heat In Telangana
Surya Kala
|

Updated on: Apr 06, 2022 | 8:47 AM

Share

Weather Alert: తెలుగు రాష్ట్రాల(Telugu States) తో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana)ల్లో ఏప్రిల్ తొలి 15 రోజుల్లో భానుడు భగభగమంటాడని.. పలు ప్రాంతాల్లో ఎండలతో పాటు, వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాలోని ప్రజలు ఉదయం  11 గంటల నుంచి సాయంత్రం 5 మధ్య బయటకు వెళ్లొద్దని వాతావరణ నిపుణుల సూచిస్తున్నారు. ఏప్రిల్ తొలి 15 రోజుల పాటు ఎండలు మండిపోయే అవకాశముందని తెలిపారు. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 15 వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. దేశంలో పలు ప్రాంతాలతో పాటు.. హిమాలయ పర్వతాల్లోనూ ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని స్పష్టం చేసింది ఐఎండీ. ఇలాంటి వాతావరణంలో ఎక్కువగా అడవుల్లో కార్చిచ్చు ఏర్పడే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

రికార్డ్ బద్దలు: మరో వైపు మార్చి నుంచే మండిపోతున్న ఎండలు దశాబ్దాల రికార్డులను బద్దలు కొడుతున్నాయి. . 1901 తర్వాత ఈ మార్చిలో అంటే 122 ఏళ్ల తర్వాత దేశంలో మార్చి నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సరాసరి 33.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో 2010లో నమోదైన 33.09 డిగ్రీల రికార్డు చెరిగిపోయింది.

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన: ఎండలతో , ఉక్కబోతతో, వడగాల్పులతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మర‌ఠ్వాడా నుంచి క‌ర్ణాట‌క మీదుగా త‌మిళ‌నాడు వ‌ర‌కు విస్తరించి ఉన్న ద్రోణి కార‌ణంగా రాష్ట్రంలో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోని కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ, తెలంగాణాలో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెద‌క్, సంగారెడ్డి, న‌ల్లగొండ‌, సూర్యాపేట జిల్లాల సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో నేడు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

Also Read: Chanakya Niti: మనిషి సంతోషంగా ఉండాలన్నా.. సక్సెస్ అందుకోవాలన్నా.. ఈ 4 విషయాలను గుర్తుంచుకోమన్న చాణక్య

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...