AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Kishan Reddy: మీరు నీతివంతులైతే భయమెందుకు.. కవిత, కేటీఆర్‌ విమర్శలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్‌..

ఈడీ నోటీసులపై బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కవిత, కేటీఆర్‌ విమర్శలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

Minister Kishan Reddy: మీరు నీతివంతులైతే భయమెందుకు.. కవిత, కేటీఆర్‌ విమర్శలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్‌..
Union Minister Kishan Reddy
Sanjay Kasula
|

Updated on: Mar 09, 2023 | 4:53 PM

Share

కవిత, కేటీఆర్‌ విమర్శలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబం అంటూ టార్గెట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. మద్యం వ్యాపారం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించండి అని తెలంగాణ సమాజం ఏమైన కల్వకుంట్ల కుటుంబానికి చెప్పిందా..? మీరు ఢిల్లీకి వెళ్లండి అక్కడ ఆఫ్ పార్టీతో కలిసి అక్రమంగా మద్యం వ్యాపారం చేయండని తెలంగాణ ఆడబిడ్డలు మీకు చెప్పారా..? ఈ కుటంబం చేసిన పనితో తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పండింది. లిక్కర్ స్కామ్‌లో మహిళన ఉండటం ఎప్పుడూ చూడలేదన్నారు. అన్నా-చెల్లెళ్లు ఇద్దరు కూడా అబద్దాలు మాట్లాడుతున్నారు.

కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న సంపాదన సరిపోదని, బయటి రాష్ట్రాల్లో వ్యాపారాలు చేయమని మీకు తెలంగాణ ప్రజలు చెప్పారా..? వ్యాపారంలో లాభాల్లో తెలంగాణ ప్రజలకు, మహిళలకు వాటాలు ఏమైనా ఇచ్చారా..? మరి కేసు అవ్వగానే తెలంగాణ ప్రజల పేరు చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

వ్యాపారంలో తప్పులు చేయన్నట్టైతే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఎందుకు లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్స్ ధ్వంసం చేశారు?

బీఆర్ఎస్ నేతలు నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నారు. అబద్దాలు ఆడటంలో బీఆర్ఎస్ నేతల్ని మించిన వాళ్లు లేరు. ధర్నా చేస్తున్నారంటూ తనకు ఈడీ నోటీసులు ఇచ్చింది.. మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉందా..? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మొదటి ఐదు సంవత్సరాలు అధికారం వెలగబెట్టిన కేసీఆర్… ఆయన పార్టీ ఒక్క మహిళ లేకుండా పాలన చేసిన వారికి మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

మీ మిత్ర పక్షం ఎంఐఎం ముందు ఒప్పించారా..? అంతెందుకు మీకు మిత్ర పక్షంగా ఉన్న ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు గతంలో పార్లమెంటులో అడ్డుకున్న విషయం మరిచిపోయారా అంటూ విమర్శించారు. ఇవాళ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టే.. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు రిజర్వేషన్ నాటకం మొదలు పెట్టారు. సానుబూతి కోసం చేస్తున్న డ్రామా మొందలు పెట్టారంటూ ఎద్దేవ చేశారు.

పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే..

ఇదిలావుంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక కక్ష సాధింపులు లేవనారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని… అధికారంలోకి వచ్చిన వెంటనే అందరిపై కక్ష సాధింపులకు దిగిన కల్వకుంట్ల కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి అందరూ అలాగే చేస్తున్నట్టు అనిపిస్తున్నారని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం