AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sheep scheme Scam: గొర్రెల స్కీంలో భారీ స్కాం.. రూ.700కోట్లు ప్రైవేట్‌ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లింపు..!

వేలు కాదు లక్షలు కాదు.. అక్షరాల 7వందల కోట్లు మింగేశారు. గొర్రెల పంపిణీ స్కీంను పెద్ద స్కాంగా మార్చేశారు. రైతులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లలోకి నిధులు మళ్లించారు. ఈ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ.. త్వరలోనే అసలు సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.

Sheep scheme Scam: గొర్రెల స్కీంలో భారీ స్కాం.. రూ.700కోట్లు ప్రైవేట్‌ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లింపు..!
Sheep Scheme Scam
Balaraju Goud
|

Updated on: Jun 01, 2024 | 8:30 AM

Share

వేలు కాదు లక్షలు కాదు.. అక్షరాల 7వందల కోట్లు మింగేశారు. గొర్రెల పంపిణీ స్కీంను పెద్ద స్కాంగా మార్చేశారు. రైతులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లలోకి నిధులు మళ్లించారు. ఈ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ.. త్వరలోనే అసలు సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.

తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ..తాజాగా ఇద్దరు కీలక అధికారులను గొర్రెల స్కామ్‌లో అరెస్ట్ చేసింది. అక్షరాల 700 కోట్ల అవినీతి జరిగినట్టు తేల్చింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన స్కామ్‌ని వెలికితీయగా భారీ అవినీతి బయటపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నలుగురు ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు..వారి నుంచి సమాచారం సేకరించి.. తాజాగా మరో ఇద్దరు కీలక అధికారులను పట్టుకుంది. తెలంగాణ పశుసంవర్థకశాఖ మాజీ ఎండీ రామ్‌చందర్‌తో పాటు మాజీ ఓఎస్‌డీ కల్యాణ్‌ను అరెస్ట్ చేసింది. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు అధికారులు. 700కోట్ల రూపాయలను రైతులకు బదులు ప్రైవేట్‌ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. వందల కోట్ల రూపాయలు బ్రోకర్స్‌, అధికారులే మింగేశారని అనుమానిస్తోంది ఏసీబీ. ఈ స్కామ్‌లో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తోంది. గొర్రెల స్కాంలో ఇప్పటివరకు దాదాపు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. త్వరలో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ రెడీ అవుతోందని టాక్ నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..