AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష ఓట్ల మెజార్టీ గ్యారెంటీ : హరీశ్ రావు

దుబ్బాక ఉపఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని టీఆర్ఎస్ కీలకనేత, మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్లయినా వస్తాయా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

లక్ష ఓట్ల మెజార్టీ గ్యారెంటీ : హరీశ్ రావు
Anil kumar poka
|

Updated on: Sep 18, 2020 | 9:48 PM

Share

దుబ్బాక ఉపఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని టీఆర్ఎస్ కీలకనేత, మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్లయినా వస్తాయా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆయా పార్టీలకు ఎంత విషయం ఉన్నదన్నది ఈ ఎన్నికతో తెలుస్తుందని అన్నారు. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ కనీసం తెలంగాణ ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయిందని హరీశ్ విమర్శించారు. ఆరేళ్ల తమ పాలనలో తాగునీరు, సాగునీరు అందించామని చెప్పారు. దుబ్బాకపై ఉన్న అభిమానంతో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 35 కోట్లు కేటాయించామని చెప్పారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేటలో కొత్తగా నిర్మించిన గెస్ట్ హౌస్, అంబులెన్స్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ హరీశ్ పై వ్యాఖ్యలు చేశారు.