AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వీడు దొంగలకే పెద్ద దొంగలా ఉన్నాడు.. బ్యాంకుకు ఇలా వచ్చాడు.. అలా ఎత్తుకెళ్లాడు..

బ్యాంక్‌ సిబ్బందికే దిమ్మతిరిగే షాకిచ్చి.. ముచ్చెమటలు పట్టించాడు ఓ వ్యక్తి.. ఏటీఎం మిషన్ చెడిపోవడంతో బ్యాంకు సిబ్బంది ఓ వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించారు. అయితే, బాగుచేస్తా అని వచ్చిన ఆ కేటుగాడు ఏటీఎంలోని డబ్బులతో ఉడాయించాడు..

Telangana: వీడు దొంగలకే పెద్ద దొంగలా ఉన్నాడు.. బ్యాంకుకు ఇలా వచ్చాడు.. అలా ఎత్తుకెళ్లాడు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Apr 02, 2023 | 8:13 AM

Share

బ్యాంక్‌ సిబ్బందికే దిమ్మతిరిగే షాకిచ్చి.. ముచ్చెమటలు పట్టించాడు ఓ వ్యక్తి.. ఏటీఎం మిషన్ చెడిపోవడంతో బ్యాంకు సిబ్బంది ఓ వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించారు. అయితే, బాగుచేస్తా అని వచ్చిన ఆ కేటుగాడు ఏటీఎంలోని డబ్బులతో ఉడాయించాడు.. ఈ షాకింగ్ సంఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని యాక్సిస్‌ బ్యాంకులో జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త సాయిబాబా గుడి రోడ్డులో ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎం మిషన్ చెడిపోయింది.. దీంతో ఓ వ్యక్తికి కాల్ చేసి పిలిచారు బ్యాంకు సిబ్బంది. అయితే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి దాని సరిచేసినట్లు చేసి వెళ్తూ, వెళ్తూ దుండగుడు ఏటీఎం మిషన్‌లోంచి 50వేలతో ఉడాయించాడు.

అయితే, అతడు వెళ్లాక ఏటీఎం మిషన్‌లో అమౌంట్ తక్కువగా రావడంతో ఆందోళన గురైయ్యారు బ్యాంకు సిబ్బంది.. అప్పుడే అసలు విషయం బయటపడింది. దీంతో బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు.

Bank Atm

Bank Atm

సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. అయితే, ఏటీఎం మిషన్ బాగు చేసే సమయంలో బ్యాంకు సిబ్బంది కూడా అతని పక్కనే ఉంటారని.. ఈ సమయంలోనే అతను డబ్బులతో ఎలా ఉడాయించాడన్నది మిస్టరీగా మారింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..