AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP K.Laxman: అయోధ్య, కాశీలో తెలుగువారికి ప్రత్యేక వసతులు- యూపీ సీఎంకు ఎంపీ లక్ష్మణ్ వినతి!

తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాది ఆలయాలైన అయోధ్య రామమందిరం, వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శనానికి వచ్చే భక్తులకు కోసం ప్రత్యేక వసతుల కల్పించాలని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

MP K.Laxman: అయోధ్య, కాశీలో తెలుగువారికి ప్రత్యేక వసతులు- యూపీ సీఎంకు ఎంపీ లక్ష్మణ్ వినతి!
Bjp Mp Laxman
Follow us
Vidyasagar Gunti

| Edited By: Anand T

Updated on: May 08, 2025 | 2:37 PM

తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాది ఆలయాల సందర్శనకు ఏటా లక్షలాదిగా భక్తులు తరలివెళ్తుంటారు. అక్కడ సరైన వసతులు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య రామమందిరం, వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్లే తెలుగు భక్తుల ఇబ్బందులను యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ దృష్టికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక వసతుల కల్పించాలని ముఖ్యమంత్రి యోగికి వినతి పత్రం అందజేశారు.

Mp Laxman

Mp Laxman

కాశీ, అయోధ్య వెళ్లే భక్తులకు తక్కువ ధరలకు సురక్షితమైన వసతి, భోజనం, పార్కింగ్, గృహాల వంటివి అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్ల అవసరం ఉందని సీఎంకు లక్ష్మణ్ వివరించారు. ప్రత్యేకంగా తెలుగు వారి కోసం కాశీ, అయోధ్యలో వసతి, భోజన, పార్కింగ్, గృహాల వంటి నిర్మాణాలకి అవసరమైన, కనీసం 200 చదరపు గజాల నుంచి 1 ఎకరం వరకు భూమి కేటాయించాలని కోరారు. భూమిని కేటాయించిన తర్వాత, అవసరమైన వసతుల కోసం తన సొంత ఎంపీ ల్యాడ్స్ నిధులు లేదా ఇతర సంబంధిత నిధుల సాయంతో నిర్మాణాలు చేపడతానని లక్ష్మణ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.

యూపీ రాజధాని లక్నోలో సీఎం యోగిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చడమే కాకుండా, తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచేలా సౌకర్యాలు కల్పిస్తామని లక్ష్మణ్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…