AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Fever Survey: తెలంగాణలో రేపటి నుంచి ఫీవర్ సర్వే.. కరోనా లక్షణాలు ఉన్నవారికి కిట్ ఇచ్చే ఏర్పాట్లు..

Fever Survey : తెలంగాణ (Telangana)లో కోవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ బీఆర్కే భవన్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్  రావు (Harish Rao) ..

TS Fever Survey: తెలంగాణలో రేపటి నుంచి ఫీవర్ సర్వే.. కరోనా లక్షణాలు ఉన్నవారికి కిట్ ఇచ్చే ఏర్పాట్లు..
Telangana Fever Survey
Surya Kala
|

Updated on: Jan 20, 2022 | 3:03 PM

Share

Fever Survey: తెలంగాణ (Telangana)లో కోవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ బీఆర్కే భవన్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్  రావు (Harish Rao)  వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీరు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించి లక్షణాలను ఉన్న వారికి కరోన కిట్ లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఫీవర్ సర్వే సెకండ్ వేవ్ లో మంచి ఫలితాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అంతేకాదు ఈ ఫీవర్ సర్వే నీతి ఆయోగ్ వారి ప్రశంస అందుకుందని చెప్పారు మంత్రి హరీష్ రావు. అయితే ప్రస్తుతం కొంతమంది కొన్ని లక్షణాలు కనిపిస్తున్నా టెస్ట్ లు చేసుకోవడం లేదు. కనుక ఇక నుంచి అన్ని విభాగాల అధికారుల తో ఫీవర్ సర్వే చేయిన్చానున్నామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు.

రాష్ట్ర వ్యాప్తంగా కరోన కేసులు పెరుగుతున్న నేపధ్యంలో .. రాష్ట్ర వ్యప్తంగా రేపటి నుండి ఫీవర్ సర్వే మొదలు పెట్టనున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సిఎం కెసిఆర్ ముందు చూపు తో ఇప్పటికే టెస్టులకు భారీగా కిట్ లను రెడీ చేసుకున్నామని చెప్పారు. ప్రతి జిల్లా, మండలం, గ్రామం.. వార్డుల్లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్రం వాక్సినేషన్ లో ముందు ఉందని.. మొదటి డోస్ 103 శాతం పూర్తి చేయగా.. రెండో డోస్ 77శాతం పూర్తి అయిందన్నారు. ఇక బూస్టర్ డోస్ వేగవంతం చేయాలని అధికారులను వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ని బస్తి దవాఖాన లో కూడా హోమ్ ఐసోలేషన్ కిట్ లు ఇవ్వనున్నామని తెలిపారు. ఇక నుంచి ఆదివారం కూడా బస్తి దవాఖానలు పని చేస్తాయన్నారు. icmr సూచన ప్రకారం టెస్టింగ్ కంటే ట్రీట్మెంట్ పైనే దృష్టి పెట్టామని చెప్పారు. మంత్రి హరీష్ రావు. ఈ ఫివర్ సర్వే లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచిస్తున్నాని తెలిపారు. ఫిబ్రవరి నెలలో జరగనున్న మేడారం పై కూడా దృష్టి పెట్టాంమని.. అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుందచెప్పారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హోమ్ ఐసోలేషన్ కిట్, టెస్టింగ్ కిట్ లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అటు వాతావరణంలో మార్పులు.. ఇటు కరోనా వ్యాప్తి కారణంగా చాలామందిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు బయటపడుతున్నాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై ఈ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.

Also Read:

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నివారించాలంటే.. ఈ ఆహారానికి దురంగా ఉండాల్సిందే..