AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: ఏ ఓటరు ఎటువైవు.. తెలంగాణాలో పొలిటికల్ మూడ్‌ని ఒడిసిపట్టిన మిషన్ చాణక్య స్టడీ రిపోర్ట్ ఇదే..

Mission Chanakya Survey Report: ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏయే పార్టీలకు ఎంతెంత శాతం ఓట్ షేర్ ఉందో లెక్క చెప్పింది మిషన్ చాణక్య. 14 లక్షల మందిని శాంపిల్‌గా తీసుకుని... అధ్యయనం చేసి రిపోర్ట్ నిచ్చింది మిషన్ చాణక్య. టోటల్‌గా జనం అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ వైపే ఉన్నట్టు చెబుతోంది. నా రాష్ట్రం-నా ఓటు- నా నిర్ణయం పేరు మీద ఆరేళ్లుగా అధ్యయనం చేస్తున్న మిషన్ చాణక్య.. లేటెస్ట్‌గా తెలంగాణాలో పొలిటికల్ మూడ్‌ని ఒడిసిపట్టే ప్రయత్నం చేసింది. బీఆర్‌ఎస్‌కి అత్యధికంగా

Telangana Elections: ఏ ఓటరు ఎటువైవు.. తెలంగాణాలో పొలిటికల్ మూడ్‌ని ఒడిసిపట్టిన మిషన్ చాణక్య స్టడీ రిపోర్ట్ ఇదే..
Mission Chanakya Survey Report
Sanjay Kasula
|

Updated on: Oct 22, 2023 | 2:32 PM

Share

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణాలో మిషన్ చాణక్య స్టడీ రిపోర్ట్ బీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏయే పార్టీలకు ఎంతెంత శాతం ఓట్ షేర్ ఉందో లెక్క చెప్పింది మిషన్ చాణక్య. 14 లక్షల మందిని శాంపిల్‌గా తీసుకుని… అధ్యయనం చేసి రిపోర్ట్ నిచ్చింది మిషన్ చాణక్య. టోటల్‌గా జనం అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ వైపే ఉన్నట్టు చెబుతోంది.

నా రాష్ట్రం-నా ఓటు- నా నిర్ణయం పేరు మీద ఆరేళ్లుగా అధ్యయనం చేస్తున్న మిషన్ చాణక్య.. లేటెస్ట్‌గా తెలంగాణాలో పొలిటికల్ మూడ్‌ని ఒడిసిపట్టే ప్రయత్నం చేసింది. బీఆర్‌ఎస్‌కి అత్యధికంగా 44.62 శాతం… కాంగ్రెస్ 32.71… బీజేపీకి 17.6 ఓటింగ్ శాతం లభించవచ్చని తెలిపింది మిషన్ చాణక్య. కానీ… లోక్‌సభ ఎన్నికల సమయానికి ఈ శాతాల్లో మార్పులుండవచ్చని కూడా చెబుతోంది.

పురుషుల కంటే మహిళల్లోనే బీఆర్ఎస్‌కి మెరుగైన ఓటింగ్ షేర్ ఉన్నట్టు తెలిపింది మిషన్ చాణక్య. అటు సామాజిక వర్గాల వారీగా కూడా ఓట్ షేర్‌ని లెక్క గట్టింది. బ్రాహ్మణులు, ఆర్యవైశ్యుల్లో బీఆర్‌ఎస్‌ కంటే బీజేపీ మీదే ఆసక్తి పెరిగిందట. గోండులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీకి ఆధిక్యం కనిపిస్తోంది.

మైనారిటీలు, దళితులు కాంగ్రెస్‌ వైపు ఉన్నారన్న వార్తలు నిజం కాదని చెబుతోంది మిషన్ చాణక్య. మైనారిటీల్లో ఎక్కువ మంది బీఆర్‌ఎస్‌తోనే ఉన్నట్టు తెలిపింది. ముస్లిం మైనారిటీ ఓట్లలో కాంగ్రెస్‌కి 38, బీఆర్‌ఎస్‌ 48 శాతం పడే ఛాన్సుంది. కాంగ్రెస్‌ పట్ల క్రిస్టియన్లలో కూడా సానుభూతి తగ్గిందట. తెలంగాణలో రైతుబంధు ప్రభావం పెరిగిందని, రైతాంగం ఓట్లు బీఆర్‌ఎస్‌కి ఎక్కువగా పడొచ్చని, కానీ ప్రైవేట్ ఉద్యోగుల్లో ఎక్కువమందికి కాంగ్రెస్ పార్టీపై సానుభూతి ఉందని తెలిపింది.

మిషన్ చాణక్య స్టడీ రిపోర్ట్ కోసం ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి