AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryapet: ఎంతకు తెగించారు.. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో దాడి..

పాత కక్ష్యలతో ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు వెంటాడి గాయపరిచారు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండా దాడికి తెగబడ్డారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా గురువారం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం..

Suryapet: ఎంతకు తెగించారు.. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో దాడి..
Suryapet Crime
Srilakshmi C
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 30, 2023 | 3:27 PM

Share

సూర్యాపేట: పాత కక్ష్యలతో ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు వెంటాడి దారుణంగా గాయపరిచారు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వెంటాడి దాడికి పాల్పడ్డారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా గురువారం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సూర్యాపేట మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ అలియాస్‌ బంటి, మహేశ్‌, సన్నీ కలిసి తాళ్లగడ్డకు చెందిన చీకూరి సంతోష్‌తో పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాటువేసి సంతోష్‌ను ఆ ముగ్గురూ అడ్డగించారు. అందరూ చూస్తుండగానే ఇద్దరు యువకులు సంతోష్‌ను అదిమి పట్టుకోగా.. ఒకరు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం బండరాళ్లతో కూడా దాడి చేశారు. నడిరోడ్డుపై ఈ దారుణాన్ని చూస్తున్న స్థానికులు చివరకు ధైర్యం చేసి నిందితులను అడ్డుకున్నారు. అనంతరం బాధితుడు సంతోష్‌ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి పోన్‌లో ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.

సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు నిందితులు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణ అలియాస్‌ బంటిపై దాడి చేసిన కేసులో 2021లో సంతోష్‌తోపాటు ఇద్దరు యువకులు జైలుకు వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి కేసు ఉపసంహరించుకోవాలని సంతోష్‌ను పలుమార్లు హెచ్చరించారు. ఈక్రమంలోనే కృష్ణ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.