AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో అప్పుడే చలి చంపేస్తోంది.. రాగల రోజుల్లో ఎలా ఉండబోతోందంటే..?

వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే రాష్ట్రంలో చలి పులి చంపేస్తోంది. రాగల రోజుల్లో చలి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. మరి ఆ వివరాలు ఏంటి.? వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయ్.. ఓ సారి లుక్కేయండి మరి.

Telangana: తెలంగాణలో అప్పుడే చలి చంపేస్తోంది.. రాగల రోజుల్లో ఎలా ఉండబోతోందంటే..?
Cold Weather
Ravi Kiran
|

Updated on: Nov 10, 2025 | 8:55 AM

Share

తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణశాఖ విడుదల చేసిన లేటెస్ట్‌ లెక్కల ప్రకారం… ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి పడిపోవడంతో ఉదయం కూడా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటోంది.

రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 2 నుండి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నేడు, రేపు వాతావరణం పాక్షికంగా మేఘావ్రుతమై ఉండే అవకాశం ఉందని…ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉపరితలంపై వీచే గాలులు ఉత్తరం లేదా ఈశాన్యం దిశ నుండి గంటకు సుమారు 4 నుండి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు త్వరగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.