AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓ వైపు వర్షం.. మరోవైపు హౌజ్ అరెస్ట్.. కాలక్షేపానికి బజ్జీలు వేసిన బీజేపీ నేత..

గురువారం నాడు భారతీయ జనతా పార్టీ డబల్ బెడ్ రూమ్ ల పైన పోరాటం చేసేందుకు బాటసింగారం వెళ్లే కార్యక్రమాన్ని పెట్టుకుంది. అయితే పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ బిజెపి రాష్ట్ర నాయకులు అందరిని ఉదయాన్నే హౌజ్ అరెస్ట్ చేశారు.

Telangana: ఓ వైపు వర్షం.. మరోవైపు హౌజ్ అరెస్ట్.. కాలక్షేపానికి బజ్జీలు వేసిన బీజేపీ నేత..
Mlc Ramachandra Rao
TV9 Telugu
| Edited By: Surya Kala|

Updated on: Jul 21, 2023 | 5:50 PM

Share

వర్షం పడి చల్ల చల్లగా ఉంటే.. మనసు వేడి వేడిగా ఏదైనా ఆహారం తినాలని.. లేదా టీ, కాఫీ వంటి వాటిని  తాగాలని మనసు కోరుకుంటుంది. ముఖ్యంగా ఎక్కువమంది వేడివేడి బజ్జీలు తినాలని భావించి వంట చేయడంలో తమ ప్రావీణ్యం చూపిస్తారు. ఇందుకు తాను మినహాయింపు కాదని నిరూపించారు ఒక రాజకీయ నేత. తనను హౌజ్ అరెస్ట్ చేస్తే.. కాలక్షేపానికి వేడి వేడి మిర్చి బజ్జీలను వేశారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.

గురువారం నాడు భారతీయ జనతా పార్టీ డబల్ బెడ్ రూమ్ ల పైన పోరాటం చేసేందుకు బాటసింగారం వెళ్లే కార్యక్రమాన్ని పెట్టుకుంది. అయితే పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ బిజెపి రాష్ట్ర నాయకులు అందరిని ఉదయాన్నే హౌజ్ అరెస్ట్ చేశారు. అందులో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును కూడా హౌస్ రెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ అయిన తర్వాత కిషన్ రెడ్డి ఢిల్లీ నుండి రావడం.. హై డ్రామా తర్వాత అయినను అరెస్టు చేయడం.. దీంతో దాదాపు సాయంత్రం వరకు బిజెపి నేతలు అందరిని ఇళ్ళకే పరిమితం చేశారు. ఒకపక్క హౌజ్ అరెస్ట్ మరోపక్క చల్లగా వర్షం.. ఏం చేయాలో అర్థం కాక బిజెపి నేత రాంచందర్ రావు తన లో వంట స్కిల్స్ కు పని చెప్పాడు. ఇంట్లో వేడివేడిగా బజ్జీలు వేస్తూ హాయిగా వర్షాన్ని ఎంజాయ్ చేశారు. మొత్తానికి పోలీస్ హౌజ్ అరెస్ట్ ఇలా వాడుకోవడం తో అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి