AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉన్నత చదవుల కోసం వెళ్లి కానరానీ లోకాలకు.. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి ఓ సరస్సులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు ధూలిమిట్టలోని కుటిగల్‌కు చెందిన తూశాలపురం సాయి రోహిత్ (23)గా గుర్తించారు. మంగవ్వ, మహదేవ్‌ దంపతుల పెద్ద కుమారుడు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో సీవీఆర్‌ కాలేజీలో

Telangana: ఉన్నత చదవుల కోసం వెళ్లి కానరానీ లోకాలకు.. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి
Student
Subhash Goud
|

Updated on: Aug 06, 2024 | 1:28 PM

Share

అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి ఓ సరస్సులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు ధూలిమిట్టలోని కుటిగల్‌కు చెందిన తూశాలపురం సాయి రోహిత్ (23)గా గుర్తించారు. మంగవ్వ, మహదేవ్‌ దంపతుల పెద్ద కుమారుడు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో సీవీఆర్‌ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రోహిత్, సియాటిల్‌లోని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చదివేందుకు 2023 డిసెంబర్‌లో యూఎస్‌ వెళ్లాడు .

రోహిత్ యూనివర్సిటీ ఆవరణలో భారతదేశానికి చెందిన తన నలుగురు స్నేహితులతో కలిసి హాస్టల్ గదిలో నివాసం ఉంటున్నాడు. జులై 22న ఔటింగ్‌కు వెళ్లిన అతను క్యాబ్‌లో హాస్టల్ గదికి తిరిగి వస్తుండగా గమ్యస్థానానికి వెళ్లే మధ్యలో మరో క్యాబ్ ఎక్కి కనిపించకుండా పోయాడు. ఫోన్ చేసినా రాకపోవడంతో అతని స్నేహితుడు అవినాష్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

జులై 24న సరస్సులో అతడి మృతదేహం లభ్యం కావడంతో.. అతడి మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సహకారంతో మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అతని స్నేహితులు కొందరు నిధులు కూడా సేకరిస్తున్నారు. ఈ ఘటనతో కుటిగల్‌లోని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి