AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలోని మసీదులపై కోర్టు కేసులు.. ముస్లీం పెద్దల కీలక సమావేశం..

దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో మసీదులపై నడుస్తున్న కేసుల గురించి సుదీర్ఘంగా చర్చించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు 18వ తేదీ కీలక సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని ముస్లిం మత పెద్దలతో పాటు, రాజకీయ నేతలు, ఎంఐఎం నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కోర్టుల్లో మసీదులపై ఉన్న కేసులతో పాటు కాశీ, మధుర, జ్ఞానవాపి మసీద్‌ అంశాలపై కూడా ప్రదానంగా చర్చ జరగనుంది.

దేశంలోని మసీదులపై కోర్టు కేసులు.. ముస్లీం పెద్దల కీలక సమావేశం..
Court Cases
Noor Mohammed Shaik
| Edited By: Srikar T|

Updated on: Jan 18, 2024 | 7:38 AM

Share

దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో మసీదులపై నడుస్తున్న కేసుల గురించి సుదీర్ఘంగా చర్చించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు 18వ తేదీ కీలక సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని ముస్లిం మత పెద్దలతో పాటు, రాజకీయ నేతలు, ఎంఐఎం నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కోర్టుల్లో మసీదులపై ఉన్న కేసులతో పాటు కాశీ, మధుర, జ్ఞానవాపి మసీద్‌ అంశాలపై కూడా ప్రదానంగా చర్చ జరగనుంది. ఈ సమావేశంలో పలు తీర్మానాలను కూడా చేయనున్నారు.

మసీదుల్లో ఐదు పూటలా కచ్చితంగా నమాజ్‌ చేయాలని, మసీదులకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గకుండా చూసుకోవాలని తీర్మానించనున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మసీదులను ఎలా కాపాడుకోవాలి. భవిష్యత్‌ కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్నదానిపై పెద్దలంతా కలిసి చర్చించుకోనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈరోజు జరిగే సమావేశంపైనే ఫోకస్‌ చేశాయి. ఈ సమావేశం రాబోయే ఎన్నికలతో పాటు ముస్లిం ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..