Telangana: మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
Telangana: ఆయన నుంచి సేకరించిన కీలక అవయవాలను ఐదుగురు ప్రాణాపాయంలో ఉన్న రోగులకు అమర్చి, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు వైద్యులు. మరణంలోనూ మహాదాతగా నిలిచిన సత్యనారాయణకు ఆసుపత్రి వైద్య సిబ్బంది, హార్ట్ టచింగ్ విజువల్స్తో ఘనంగా వీడ్కోలు పలికారు. సత్యనారాయణ..

Telangana: ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. తమ కంటి వెలుగు దూరమైందనే బాధలో మునిగిపోయింది. కానీ ఆ విపత్కర పరిస్థితుల్లోనూ వారు తీసుకున్న ఒక నిర్ణయం ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామానికి చెందిన 39 ఏళ్ల సత్యనారాయణ జీవితం ఒక రోడ్డు ప్రమాదంతో ముక్కలైంది. తన గ్రామానికి చెందిన షరీఫ్ అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనం పై ఓ పనిమీద వెళ్తుండగా, సదాశివపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఒక కారు వీరి బైక్ ను బలంగా ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో సత్యనారాయణ తలకు బలమైన గాయాల య్యాయి. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సత్యనారాయణ.. బ్రెయిన్ డెడ్ కావడంతో తుదిశ్వాస విడిచాడు. సంపాదించే వ్యక్తి దూరమవడంతో ఆ కుటుంబం మొత్తం కన్నీరుము న్నీరైంది. గుండె పగిలే బాధలోనూ ఆ కుటుంబ సభ్యులు సాహసో పేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. సత్యనారాయణ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఇది కూడా చదవండి: Investment: బంగారం అద్భుతం చేసింది.. కేవలం లక్ష రూపాయలు రూ.15 లక్షలుగా మార్చేసింది..!
దీంతో ఆయన నుంచి సేకరించిన కీలక అవయవాలను ఐదుగురు ప్రాణాపాయంలో ఉన్న రోగులకు అమర్చి, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు వైద్యులు. మరణంలోనూ మహాదాతగా నిలిచిన సత్యనారాయణకు ఆసుపత్రి వైద్య సిబ్బంది, హార్ట్ టచింగ్ విజువల్స్తో ఘనంగా వీడ్కోలు పలికారు. సత్యనారాయణ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఐదుగురి రూపంలో జీవించే ఉంటాడు.
ఇది కూడా చదవండి: Vande Bharat: ఆ వందే భారత్లో కీలక మార్పులు.. ఇప్పుడు 8 కోచ్లకు బదులుగా 20 కోచ్లు
ఇది కూడా చదవండి: Aadhaar: లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
