Rahul Gandhi: స్కూల్ పిల్లలతో రాహుల్ గాంధీ రన్.. తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర ఫుల్ జోష్
అదే జోరు-అదే హోరు-అదే ఉత్సాహం. తెలంగాణలో ధూంధాంగా సాగుతోంది రాహుల్ జోడో యాత్ర. ఒకవైపు ప్రత్యర్ధులపై పొలిటికల్ బాంబులు పేల్చుతూనే... మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఏదో రొటీన్గా నడిచి వెళ్లిపోకుండా... దారి పొడవునా ఇంట్రెస్టింగ్ సీన్స్తో పాదయాత్రను రక్తికట్టిస్తున్నారు రాహుల్గాంధీ.

తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర ఫుల్ జోష్తో సాగుతోంది. అన్ని వర్గాలతో మమేకమవుతోన్న రాహుల్గాంధీ… ప్రొఫెసర్లు, మేధావులు, విశ్లేషకులతో మాట్లాడి, తెలంగాణలో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఏం చేయాలో చెప్పండి అంటూ సూచనలు సలహాలు తీసుకుంటున్నారు రాహుల్. బీజేపీ అండ్ టీఆర్ఎస్పై మరోసారి నిప్పులు చెరిగారు రాహుల్. రెండు పార్టీలూ ధన రాజకీయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఫైరయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్… రెండూ ఒక్కటేనన్న రాహుల్… దేశంలో బీజేపీ… తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలన సాగిస్తున్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు.
రాహుల్తో కలిసి నడవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే, రాహుల్తో నడక అంటే జస్ట్ వాకింగ్ కాదు, పరుగులు పెట్టాల్సిందే. అంత స్పీడ్గా నడుస్తున్నారు రాహుల్గాంధీ. ఒక్కోసారి రన్ రాజా రన్ అంటూ పరుగు అందుకుంటోన్న రాహుల్ ఫిట్నెస్ను చూసి అవాక్కవుతున్నారు కాంగ్రెస్ లీడర్స్ అండ్ పబ్లిక్.
పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. స్కూల్ పిల్లలతో కలిసి రేస్ లో పాల్గొన్నారు. చిన్న పిల్లల రేసును నడిపిద్దాం? సవాల్ని స్వీకరించి వారితో పరుగుతీశాడు. గుంపు మధ్యలో నుండి ఎవరో “రేస్ లగాగే?” అని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి రాహుల్ పరుగు పరుగున సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
Out for a marathon, but let’s sprint! ?♂️#BharatJodoYatra pic.twitter.com/d7GIbYQXXA
— Bharat Jodo (@bharatjodo) October 30, 2022
జోడో యాత్రలో రాహుల్తో కలిసి నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు కామన్ పీపుల్. పిల్లలు, పెద్దలు, రైతులు, కార్మికులు, ప్రజా సంఘాలతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు రాహుల్గాంధీ. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ధూంధాంగా సాగుతోంది రాహుల్ జోడో యాత్ర.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ ఈ ఉదయం ఇక్కడి నుంచి పాదయాత్రను పునఃప్రారంభించారు. 22 కి.మీ మేర సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో 5 రోజుల భారత్ జోడో యాత్ర నేటితో ముగిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
