కేటీఆర్‎పై కేసు నమోదు.. అసలు కారణం ఇదే..

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం, మూడు విమర్శలు, ఆరు ఆరోపణలతో వేడెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి కెటిఆర్‎పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కేటీఆర్‎పై కేసు నమోదు.. అసలు కారణం ఇదే..
KTR - Revanth Reddy

Updated on: Mar 30, 2024 | 4:26 PM

హైదరాబాద్, మార్చి 30: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం, మూడు విమర్శలు, ఆరు ఆరోపణలతో వేడెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి కెటిఆర్‎పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో బిల్డర్లు, వ్యాపారుల నుంచి రూ.2,500 కోట్లు దోపిడీ చేసి పార్టీ హైకమాండ్‌కు ఇచ్చారని కేటీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడంతో హైదరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని కూడా కేటీఆర్ అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హన్మకొండకు చెందిన టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌ తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు IPC సెక్షన్లు 505, 505(2) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.

మార్చి 27, బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మల్కాజ్‌గిరి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థిగా ఈటల రాజేందర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కేటీఆర్‌ ప్రధానంగా టార్గెట్‌ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌, గజ్వేల్‌లో ఓటమికి గురవడంతో రాజేందర్‌ మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఓట్లు అడిగే ముందు గత దశాబ్దంలో బీజేపీ లేదా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వాలని రాజేందర్‌ను కోరారు. రైతుల రుణాల కంటే కార్పొరేట్ రుణమాఫీకే బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ విమర్శించారు.

అంతకుముందు మల్కాజిగిరిలో పోటీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌కి సవాల్‌ విసిరారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని ఎన్నికల బరిలోకి దిగితే లోక్‌సభ ఎన్నికల్లో ఆయనపైనే పోటీ చేస్తానని మరోసారి ఉద్ఘాటించారు. ‘ముఖ్యమంత్రిగా ఇంత ముఖ్యమైన పదవిలో ఉన్నప్పటికీ సవాల్‌ని స్వీకరించడానికి రేవంత్ రెడ్డికి భయంగా ఉందని, ప్రత్యక్ష సవాలును ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదని’ కేటీఆర్ ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారని ఉద్ఘాటించారు. రేవంత్ రెడ్డి చర్యలు “కాంగ్రెస్ నాయకుడిలా కాకుండా బీజేపీ నాయకుడిలా ఉన్నాయి” అని తప్పుడు ఆరోపణలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us