వీడికి చిన్నారులు కనిపిస్తే చాలు కాటేస్తాడు.. చిన్నారుల లైంగిక దాడిలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నిందితుడు

మహిళలు, చిన్నారులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. అయినా వారిలో ఏ మాత్రం..

వీడికి చిన్నారులు కనిపిస్తే చాలు కాటేస్తాడు.. చిన్నారుల లైంగిక దాడిలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నిందితుడు
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jul 11, 2021 | 9:51 AM

మహిళలు, చిన్నారులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. అయినా వారిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. చిన్నారి బాలికలే లక్ష్యంగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ కామాంధున్ని రాచకొండ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డ్రగ్స్‌కు బానిసలైన చిన్నారుల పట్ల వికృతంగా ప్రవర్తించే 40 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన అభిరామ్‌దాస్‌ అలియాస్‌ అభి 12 సంవత్సరాల కిందట భార్యతో కలిసి నగరానికి వలస వచ్చాడు. అయితే 8 ఏళ్ల కిందట భార్య వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు. మేడ్చల్‌ జిల్లా కీసర మండల పరిధి బండ్లగూడలోని ఓ గదిలో అద్దెకుంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసగా మారిన అభిరామ్‌దాస్‌ కామవాంఛను తీర్చుకునేందుకు చిన్నారులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ క్రమంలో దమ్మాయిగూడ వెంకటేశ్వరకాలనీలో ఈ నెల 4న మూడున్నరేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేశాడు. దీంతో గమనించిన మరో బాలిక ఆ చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు చిన్నారిని రాత్రంతా సమీప అటవీ ప్రాంతంలోనే ఉంచి అఘాయిత్యానికి పాల్పడి, ఆపై సమీపంలోని నీళ్ల ట్యాంకు వద్ద వదిలి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు.

ఇక రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా, నిందితుడు మరో బాలికను అపహరించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. దమ్మాయిగూడ ప్రాంతంలోని కిరాణా దుకాణానికి వచ్చిన నిందితుడు అక్కడే ఉన్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా, సదరు బాలిక తల్లి ప్రతిఘటించడంతో పారిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అటవీ ప్రాంతంలో అరెస్టు చేశారు. అయితే కీసర ఠాణా పరిధిలో మరో చిన్నారిపై దాడికి పాల్పడిన ఘటనలో ఈ కామాంధున్ని నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి దారుణాలకు పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష వేయాలని రాచకొండ కమిషనరేట్‌ ఎదుట బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తికి వినతిపత్రం అందజేశారు.

ఇవీ కూడా చదవండి

Dog: పెంపుడు కుక్క తరచూ మొరుగుతోందని ఓ వ్యక్తి చేసిన పనిని చూస్తే షాక్‌ అవుతారు..!

Crime: అమానుషం.. మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..

Latest Articles
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
ధోని నాకు తండ్రితో సమానం'.. 'బేబి మలింగ' కామెంట్స్ వైరల్
ధోని నాకు తండ్రితో సమానం'.. 'బేబి మలింగ' కామెంట్స్ వైరల్