Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బస్సు-బొలెరో ఢీ.. చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్‌(Zahirabad) వద్ద ప్రైవేటు బస్సు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి బొలెరో వాహనంలోని వ్యక్తి....

Telangana: బస్సు-బొలెరో ఢీ.. చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం
Fire
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 10, 2022 | 7:53 AM

సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్‌(Zahirabad) వద్ద ప్రైవేటు బస్సు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి బొలెరో వాహనంలోని వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలను అదుపులోకి తెచ్చారు. మృతుడు, గాయపడిన వారు కర్ణాటక(Karnataka) వాసులుగా గుర్తించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ప్రమాదం జరిగిన కారణాలపై ఆరా తీస్తున్నారు. తెల్లవారు జాము జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. మంటలు ధాటిగా చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

ఇవి కూడా చదవండి