AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అర్ధరాత్రి ఘోరం.. ఇంటి మిద్దె కూలి ముగ్గురు చిన్నారులు సహా తల్లి దుర్మరణం..

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఇంటి మట్టి మిద్దె కూలి ముగ్గురు చిన్నారులతో సహా తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ వనపట్ల గ్రామంలో జరిగింది.. అర్ధరాత్రి నిద్రిస్తున్న వారిపై భారీ మట్టిదిబ్బలు పడటంతో..

Telangana: అర్ధరాత్రి ఘోరం.. ఇంటి మిద్దె కూలి ముగ్గురు చిన్నారులు సహా తల్లి దుర్మరణం..
Crime News
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jul 01, 2024 | 12:18 PM

Share

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఇంటి మట్టి మిద్దె కూలి ముగ్గురు చిన్నారులతో సహా తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ వనపట్ల గ్రామంలో జరిగింది.. అర్ధరాత్రి నిద్రిస్తున్న వారిపై భారీ మట్టిదిబ్బలు పడటంతో గొడుగు భాస్కర్.. భార్య గొడుగు పద్మ, పిల్లలు తేజస్వీని(6), వసంత(6), రుత్విక్(4) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. భాస్కర్ కు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు.

అసలేం జరిగిందింటే..

ఎప్పటిలాగే ఆదివారం రాత్రి భోజనం ముగించుకొని కుటుంబ సభ్యులు అందరూ నిద్రకు ఉపక్రమించారు. ముందు గదిలో గొడుగు భాస్కర్ తల్లిదండ్రులు పడుకోగా… రెండవ గదిలో భాస్కర్ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రించారు. అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఒక్కసారిగా మిద్దె కూలీ మట్టి దిబ్బలు, దూలాలు వారిపై పడిపోయాయి. మట్టి దిబ్బల కిందే ముగ్గురు పిల్లలతో సహా తల్లి తుదిశ్వాస విడిచారు. మొదట తండ్రి భాస్కర్ సైతం ప్రాణాలు కోల్పోయాడని భావించారు. శరీరంలో కదలిక కనిపించడంతో స్థానికులు ఆయనకు సీపీఆర్ నిర్వహించారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భాస్కర్ అక్కడే చికిత్స పొందుతున్నారు.

దీంతో వనపట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు చిన్నారులు, తల్లి మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కళ్లముందే ఆడుకుంటు తిరిగే చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడాన్ని తట్టుకోలేక గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలినట్లు చెబుతున్నారు.

జిల్లా అస్పత్రిలో నలుగురు బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పరామర్శించారు. చికిత్స పొందుతున్న భాస్కర్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

భారీ వర్షాలతో మట్టిమిద్దె బాగా తడిసిపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు, గ్రామస్థులు అంచనా వేస్తున్నారు. ఇటువంటి మట్టె మిద్దెలు ఉన్నవాళ్లు, పురాతన ఇళ్లలో నివసించే వారు తక్షణమే ఖాళీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!