AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రియుడితో కలిసి ఆరేళ్ల కొడుకును హతమార్చిన తల్లి..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి, తన ప్రియుడితో కలిసి ఆరేళ్ల కొడుకునే నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఘటన తాలుకూ పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ...

Telangana: ప్రియుడితో కలిసి ఆరేళ్ల కొడుకును హతమార్చిన తల్లి..
Arush
Follow us
G Sampath Kumar

| Edited By: Ram Naramaneni

Updated on: May 07, 2025 | 3:55 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌కు చెందిన మంగళారపు మాధవి, మంగళారపు అరుణ్ కుమార్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. వీరికి ఒక కూతురు (8), ఒక కుమారుడు ఆరుష్ (6) ఉన్నారు. కొంతకాలం క్రితం మాధవి భర్త అరుణ్ అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మరణం తర్వాత మాధవి, కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన సామల్ల బాల కిషన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తాజాగా మాధవి తన ప్రియుడితో కలిసి చిన్నారి ఆరుష్‌పై విచక్షణరహితంగా దాడికి తెగబడ్డారు. చిన్నారి తన తల్లికి బాలకృష్ణ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ దాడికి కారణమని సమాచారం. బాలుడిపై తీవ్రంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు బాలుణ్ణి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరుష్ తుదిశ్వాస విడిచాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

మాధవితో అక్రమ సంబంధం పెట్టుకున్న కిషన్.. తమను, తమ కుటుంబ సభ్యులను తరచూ బెదిరింపులకు గురి చేసేవాడని మృతుడి నాయనమ్మ  అనసూర్య రోదిస్తూ తెలిపింది. పిల్లలు ఇద్దరినీ తమ వద్ద నుండి తీసుకెళ్లి మనవడి ప్రాణం తీసిందని ఆరోపించింది. మాధవి, కిషన్ ల అక్రమ సంబందానికి అడ్డుగా ఉన్నారనే నెపంతోనే వారు దాడి చేస్తేనే మనవడు ఆరుష్ మరణించాడని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తమ మనవరాలినైనా తమకు అప్పగించాలని వేడుకుంది. మాధవి, కిషన్ నుండి తమకు ప్రాణహాని ఉందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరుష్ తాత లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాధవి, కిషన్ ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపిన పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని
PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య వీడియో
PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య వీడియో
గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన దివంగత స్టార్‌ హీరో కూతురు!
గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన దివంగత స్టార్‌ హీరో కూతురు!