Telangana: ‘అలాంటి పరిస్థితికి దిగజారలే..’ కేటీఆర్‌కు శ్రీధర్ బాబు కౌంటర్

|

Apr 13, 2024 | 1:55 PM

కాంగ్రెస్ మంత్రుల ఫోన్లనే రేవంత్‌ రెడ్డి ట్యాపింగ్‌ చేస్తున్నారన్న కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌ బాబు కౌంటర్‌ ఇచ్చారు. అలాంటి పరిస్థితికి తాము దిగజారలేదన్నారు. తాము ఎవ్వరి ఫోన్లనూ ట్యాపింగ్‌ చేయడం లేదని కేటీఆర్‌ ఆరోపణలను ఖండించారు.

TV9 క్రాస్‌ఫైర్‌లో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తోందన్న ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు వరుసబెట్టి ఖండిస్తున్నారు. మంత్రుల ఫోన్లు ట్యాప్‌ కావడం లేదంటున్నారు. తమ ప్రభుత్వం ఎవ్వరి ఫోన్లనూ ట్యాప్‌ చేయడం లేదన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. మంత్రులు భట్టి, పొంగులేటి ఫోన్లను ట్యాప్‌ చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ లోపాయకార ఒప్పందాలు చేసుకుని తమపై కుట్రలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…