TV9 క్రాస్ఫైర్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయిస్తోందన్న ఆరోపణలను కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి ఖండిస్తున్నారు. మంత్రుల ఫోన్లు ట్యాప్ కావడం లేదంటున్నారు. తమ ప్రభుత్వం ఎవ్వరి ఫోన్లనూ ట్యాప్ చేయడం లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. టీవీ9 క్రాస్ఫైర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. మంత్రులు భట్టి, పొంగులేటి ఫోన్లను ట్యాప్ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయకార ఒప్పందాలు చేసుకుని తమపై కుట్రలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…