ఐదొద్దుల రోజు ఆగమాగం.. కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!
మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య వెలుగు చూసింది. కులపెద్దతో ఘర్షణ పడ్డాడనే ఆగ్రహంతో ఒక వ్యక్తిని తోటి కులస్తులే అత్యంత దారుణంగా రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

కులపెద్దతో ఘర్షణ పడ్డాడనే ఆగ్రహంతో ఒక వ్యక్తిని తోటి కులస్తులే అత్యంత కొట్టి చంపిన సఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మడిపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి స్థానికంగా ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఇటీవల వీరి కులానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి మృతి చెందారు. అయితే మరణించిన వ్యక్తి ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి కావడంతో కులస్తులంతా కలిసి స్థానిక కమ్యూనిటీ హాల్ వద్ద 5వ రోజు శాంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగానే అందరూ కలిసి ఒకే చోట కూర్చొని మద్యం సేవిస్తూ దావత్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య చిన్నగా గొడవ స్టార్ట్ అయింది. అయితే అక్కడే ఉన్న రమేష్ తమ కులపెద్ద అయిన యాకయ్యతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన తోటి కులస్తులు రమేష్పై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు రమేష్ పరుగులు తీసినప్పటికీ, వెంటాడి కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
దీంతో ఈ దారుణానికి పాల్పడిన నిందితులు అంతా నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
