Telangana: తెలంగాణకు 3 రోజుల పాటు భారీ వర్షసూచన
తెలంగాణకు వర్షసూచన చేసింది వాతావరణ శాఖ. నేటి నుంచి మే 11 వరకు 20 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురస్తాయని వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...

రాబోయే 3 రోజులు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని 20 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని, వేసవి వేడిగాలుల నుండి ప్రజలకు స్వల్ప ఉపశమనం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మే 9, శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, హైదరాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
శనివారం మే 10న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం ఉంటుంది.
మే 11 ఆదివారం నాడు, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మే 12 ఉదయం 8:30 గంటల వరకు ఈ తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.
రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత మళ్లీ 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.