AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భర్త మరణంతో మానసికంగా కుంగిపోయి.. 15 రోజులు గుండెలవిసేలా రోదించి..

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళ్‌హాట్‌ ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Hyderabad: భర్త మరణంతో మానసికంగా కుంగిపోయి.. 15 రోజులు గుండెలవిసేలా రోదించి..
Asmitha
Ram Naramaneni
|

Updated on: Jan 10, 2024 | 4:53 PM

Share

భర్త అంటే ఆమెకు చెప్పలేనంత ప్రేమ. ఆ దంపతులు చూసి ముచ్చటైన జంట అని అందరూ  మెచ్చుకున్నారు. కష్టసుఖాల్లో పంచుకుంటూ ఇద్దరు పిల్లలతో వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ వారి అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో.. భర్తను బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో బలితీసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక కొద్ది రోజులకు భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద  ఘటన మంగళ్‌హాట్‌ ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహీంపురకు చెందిన అమన్‌కుమార్‌సింగ్‌(36)కు అప్పర్‌ ధూల్‌పేట ఆరాంఘర్‌కాలనీకి చెందిన అస్మిత(31)తో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి రోనక్‌, రిత్విక్‌ ఇద్దరు సంతానం. గచ్చిబౌలిలో ప్రైవేటు జాబ్ చేసే అమన్‌కుమార్‌సింగ్‌ గత నెల 26న రాత్రి బీపీ ఎక్కువై బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చనిపోయాడు అయితే భర్త ఆకస్మిక మరణాన్ని అస్మిత జీర్ణించుకోలేక పోయింది. దీంతో 15 రోజులుగా భర్త ఫొటోను దగ్గర పెట్టుకొని నిత్యం గుండెలవిసేలా రోదించింది. తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం సాయంత్రం ఆరాంఘర్‌కాలనీలోని పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి.. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..