AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇల్లీగల్ అఫైర్… అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

బస్సు డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అతడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిన ఘటన హైదరాబాద్‌లోని మూసాపేటలో జరిగింది. విజయనగరం జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రావుకు భార్య నాగమణి, ఇద్దరు పిల్లలున్నారు. వీరు హైదరాబాద్‌, విజయవాడలో జరిగే ఎగ్జిబిషన్‌లలో స్టాళ్లు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కనకదుర్గ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేసే కృష్ణా జిల్లాకు చెందిన కన్నాతో వీరికి పరిచయం ఏర్పడింది. దీంతో నాగేశ్వర్‌రావు ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలోనే నాగమణి, కన్నా […]

ఇల్లీగల్ అఫైర్... అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 09, 2019 | 10:40 AM

Share

బస్సు డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అతడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిన ఘటన హైదరాబాద్‌లోని మూసాపేటలో జరిగింది.

విజయనగరం జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రావుకు భార్య నాగమణి, ఇద్దరు పిల్లలున్నారు. వీరు హైదరాబాద్‌, విజయవాడలో జరిగే ఎగ్జిబిషన్‌లలో స్టాళ్లు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కనకదుర్గ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేసే కృష్ణా జిల్లాకు చెందిన కన్నాతో వీరికి పరిచయం ఏర్పడింది. దీంతో నాగేశ్వర్‌రావు ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలోనే నాగమణి, కన్నా మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని కన్నా భార్య పుష్ప నాగేశ్వర్‌రావుకు చెప్పడంతో అతడు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. కన్నాను కూడా ఇంటికి రావొద్దని చెప్పేశాడు.

తమ బంధానికి అడ్డుగా ఉన్న నాగేశ్వర్‌రావును అడ్డు తొలగించుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. నాగేశ్వర్‌రావును హత్యచేస్తే రూ.50వేలు ఇస్తానని కన్నా తన స్నేహితుడు షేక్ సుభానీకి చెప్పడంతో అతడు అంగీకరించాడు. దీంతో సుభానీని రెండు రోజులపాటు నాగేశ్వర్‌రావు ఇంటికి పంపాడు. ఈనెల 1న సుభాని, నాగేశ్వర్‌రావు మద్యం తాగారు. అనంతరం నిద్రలోకి జారుకున్న నాగేశ్వర్‌రావును సుభానీ కత్తితో పొడిచి చంపేశాడు. నాగమణిపై నిఘా పెట్టిన పోలీసులు ఆమె కాల్‌డేటాను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.