AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మూడు సెకన్లలో ముంచుకొచ్చిన మృత్యువు.. బైక్‌పై కూలిన భారీ వృక్షం! వీడియో వైరల్

మృత్యువు ఏ క్షణంలో ఎలా ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు.. ఇప్పుడు చూడబోయేది అలాంటి షాకింగ్‌ సీనే! సికింద్రాబాద్‌ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో ఉన్నట్టుండి ఓ భారీ చెట్టు కూలిపోయింది. అదే సమయంలో చికిత్స కోసం ఆస్పత్రి లోపలికి టూవీలర్‌పై వస్తున్న భార్యాభర్తలపై అది..

Srilakshmi C
|

Updated on: May 21, 2024 | 1:18 PM

Share

బొల్లారం, మే 21: మృత్యువు ఏ క్షణంలో ఎలా ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు.. ఇప్పుడు చూడబోయేది అలాంటి షాకింగ్‌ సీనే! సికింద్రాబాద్‌ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో ఉన్నట్టుండి ఓ భారీ చెట్టు కూలిపోయింది. అదే సమయంలో చికిత్స కోసం ఆస్పత్రి లోపలికి టూవీలర్‌పై వస్తున్న భార్యాభర్తలపై అది పడిపోయింది. స్పాట్‌లో భర్త ప్రాణాలు కోల్పోగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

బైక్‌ నడుపుతున్న రవీందర్ చెట్టు కూలిపోతుందన్న విషయాన్ని గమనించలేదు. ఏమాత్రం చెట్టు ఒరిగిపోతున్నట్టు చూసినా ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేవారేమో..! మూడే మూడు సెకన్ల గ్యాప్‌లో అంతా జరిగిపోయింది. ఆ కుటుంబం టూవీలర్‌పై ఆస్పత్రిలోపలికి ఎంటరవడం.. అదే సమయంలో చెట్టు కూలిపోవడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ విషాదం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. చెట్టుకూలిన ఘటనలో రవీందర్ స్పాట్‌లోనే చనిపోయారు. ఆయన భార్య సరళ పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరళాదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. భార్యాభర్తలకు జరిగిన ఈ ప్రమాదంతో తీవ్ర విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.