AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు, రీ వెరిఫికేషన్ గడువు పెంపు

ఇంటర్ బోర్డు ఫలితాల్లో అవకతవకలపై తెలంగాణలో దుమారం రేగుతోంది. విద్యార్థుల ఆత్మహత్యలతో పరిస్థితి తీవ్ర రూపు సంతరించుకుంది. మూల్యాంకనంలో తప్పుల దొర్లడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రెండు రోజులుగా ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తున్నారు. అటు రాజకీయ నేతలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఇంటర్ బోర్డు వ్యవహారం రాష్ట్రాన్ని ఊపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో  విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇంటర్మీడియెట్ సమాధాన […]

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు, రీ వెరిఫికేషన్ గడువు పెంపు
Ram Naramaneni
|

Updated on: Apr 23, 2019 | 7:15 PM

Share

ఇంటర్ బోర్డు ఫలితాల్లో అవకతవకలపై తెలంగాణలో దుమారం రేగుతోంది. విద్యార్థుల ఆత్మహత్యలతో పరిస్థితి తీవ్ర రూపు సంతరించుకుంది. మూల్యాంకనంలో తప్పుల దొర్లడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రెండు రోజులుగా ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తున్నారు. అటు రాజకీయ నేతలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఇంటర్ బోర్డు వ్యవహారం రాష్ట్రాన్ని ఊపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో  విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇంటర్మీడియెట్ సమాధాన పత్రాల రీవెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌తో పాటు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పెంచారు. ఈ నెల 27 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఐతే ఫలితాల్లో తప్పులకు ఇంటర్ బోర్డే బాధ్యత వహించాలని..రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ను ఉచితంగా చేయాలని విద్యార్థి డిమాండ్ సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ అందుకు అధికారులు అంగీకరించలేదు. రీ వెరిఫికేషన్‌కు రూ.600, రీ కౌంటింగ్‌కు రూ.100 ఫీజు చెల్లించాలని స్పష్టంచేశారు. ఇంటర్ పరీక్షల మూల్యాంకనంలో తప్పిదాలు జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు ప్రయత్నించినప్పటికీ లింక్ ఓపెన్ కావడం లేదు. అటు ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో విద్యార్థుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇంటర్ బోర్డు అధికారులు.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?