Indiramma Illu: గుడ్ న్యూస్.. ఆ ఇళ్లకు కూడా డబ్బులే.. ఇందిరమ్మ ఇళ్లపై అదిరిపోయే అప్డేట్
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.. త్వరలోనే.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లపై బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.. త్వరలోనే.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లపై బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలలో లక్షా 12వేల ఇళ్లు పూర్తి కావొస్తున్నాయని తెలిపారు. జూన్ వరకు మరో లక్ష ఇళ్లు పూర్తి కాబోతున్నాయని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. ఏప్రిల్ చివరి వారం లేదా మే నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. గతంలో సగంలో వదిలేసిన గృహలక్ష్మీ ఇళ్లకు కూడా నిధులిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇల్లు నిర్మాణం బట్టి ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. దీంతో.. గతంలో ఇల్లు నిర్మించుకుని.. నిధులు రాని వారికి లబ్ది చేకూరనుంది.
ఇదిలాఉంటే.. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని మంత్రి ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో బస్తీలకు దగ్గరలోనే ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, దూరప్రాంతాల్లో ఇళ్లు ఇస్తే లబ్దిదారులు వెళ్లడం లేదన్నారు. గ్రేటర్ పరిధిలో 14, 15 స్లమ్స్ ఇప్పటికే గుర్తించామని తెలిపారు. గ్రేటర్తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి వివరించారు. హైదరాబాద్ సహా.. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి నగరాల్లోనూ ఇళ్ల నిర్మాణాలు చేపడుతామని.. మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
