AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OYO: ఓయో హోటల్ మేనేజర్ ఆత్మహత్య.. ఏం జరిగిందో..?

ప్రముఖ హోటల్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఓయో హోటల్‌ మేనేజర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన గదిలోకి వెళ్లి ఎంతకీ తలుపు తీయకపోవడంతో సిబ్బంది తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా..

OYO: ఓయో హోటల్ మేనేజర్ ఆత్మహత్య.. ఏం జరిగిందో..?
OYO hotel
Srilakshmi C
|

Updated on: Apr 18, 2023 | 10:31 AM

Share

ప్రముఖ హోటల్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఓయో హోటల్‌ మేనేజర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన గదిలోకి వెళ్లి ఎంతకీ తలుపు తీయకపోవడంతో సిబ్బంది తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ వివరాల ప్రకారం..

ఉత్తర్‌ప్రదేశ్‌ కుషమ్‌కాష్‌ గ్రామానికి చెందిన అనురద్‌సింగ్, సచిన్‌సింగ్‌(30) అనే ఇద్దరు వ్యక్తులు నాచారం మల్లాపూర్‌లో ఉంటూ ఓయో హోటల్‌లో పనిచేస్తున్నారు. వీరిలో సచిన్‌సింగ్‌ అనే వ్యక్తి గత మూడు నెలలుగా మల్కాజిగిరి మారుతీనగర్‌లోని సాయి మాన్సన్‌ ఓయో హోటల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐతే ఏ జరిగిందో తెలియదు ఈ నెల16వ తేదీ రాత్రి తన రూమ్‌లోకి వెళ్లిన సచిన్‌సింగ్‌ ఎంతకీ తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది తలుపు పగులగొట్టి లోపినికి ప్రవేశించారు. ఫ్యాన్‌కు ఉరివేసుకొని విగత జీవిగా కనిపించాడు. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకొనని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.