AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొత్త పింఛన్లకు ముహూర్తం నేడే.. వారికీ ఆసరా అందించాలని నిర్ణయం.. ఆదేశాలు జారీ

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ (Telangana) ప్రభుత్వం గతంలో గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి కొత్తంగా పది లక్షల మంది పింఛన్లు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు అధికారులు అన్ని...

Telangana: కొత్త పింఛన్లకు ముహూర్తం నేడే.. వారికీ ఆసరా అందించాలని నిర్ణయం.. ఆదేశాలు జారీ
telangana cm kcr
Ganesh Mudavath
|

Updated on: Aug 15, 2022 | 8:01 AM

Share

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ (Telangana) ప్రభుత్వం గతంలో గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి కొత్తంగా పది లక్షల మంది పింఛన్లు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త ఆసరా పింఛన్ల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం నెలాఖరు వరకు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆసరా పింఛన్లతో పాటు ఆసరా కార్డులను కూడా పంపిణీ చేస్తామన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు కొత్త కార్డులుల పంపించారు. కాగా.. ఆసరా పింఛన్ల అర్హత వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షలకు పైగా అర్హత కలిగిన వ్యక్తులకు పింఛన్లు (Pensions) అందాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 35.95 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పైలేరియా, హెచ్‌ఐవీ రోగులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులకు ప్రభుత్వం నెల నెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. దివ్యాంగులకు నెలకు రూ.3,016, వృద్ధులు, వితంతువులు, ఇతర క్యాటగిరీల వారికి నెలకు రూ.2,016 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది.

ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తాం. కొత్తకార్డులను బార్‌కోడ్‌తో ఇస్తున్నాం. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పింఛన్లు 46 లక్షలకు చేరాయి. వీటికి సంబంధించిన ఆసరా కార్డులు అందిస్తాం. డయాలసిస్ రోగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే వారికి కూడా పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్రంలో దాదాపు 12 వేల మంది డయాలసిస్‌ రోగులు ఉన్నారు. వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కొనసాగిస్తూనే ఆసరా కార్డు కూడా ఇస్తాం. దీంతో వారికి ప్రతి నెలా రూ.2016 పింఛన్‌ అందుతుంది. బోదకాలు బాధితులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఘనత తెలంగాణదే.

  – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్