AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railways: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్‌.. 20 రూపాయలకే పసందైన భోజనం.

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రైల్వే స్టేషన్స్‌లో తక్కు ధరలో ఆహారాన్ని అందిస్తున్నారు. జనరల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి లాభం చేకూర్చే ఉద్దేశంతో నాణ్యమైన ఎకానమీ మీల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మీల్స్‌లో రెండు రకాల భోజనాన్ని అందిస్తున్నారు. ఎకానమీ భోజనం రూ. 20 కాగా, కాంబో భోజనం రూ. 50గా నిర్ణయించారు...

Railways: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్‌.. 20 రూపాయలకే పసందైన భోజనం.
Railways
Narender Vaitla
|

Updated on: Jul 21, 2023 | 2:34 PM

Share

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రైల్వే స్టేషన్స్‌లో తక్కు ధరలో ఆహారాన్ని అందిస్తున్నారు. జనరల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి లాభం చేకూర్చే ఉద్దేశంతో నాణ్యమైన ఎకానమీ మీల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మీల్స్‌లో రెండు రకాల భోజనాన్ని అందిస్తున్నారు. ఎకానమీ భోజనం రూ. 20 కాగా, కాంబో భోజనం రూ. 50గా నిర్ణయించారు. ఈ మీల్స్‌ రైల్వే స్టేషన్స్‌లో ఉండే ఇండియన్‌ రైల్వే టూరిజం అండ్‌ క్యాటరింగ్ సర్వీస్‌ (ఐఆర్‌సీటీసీ)కి చెందిన కిచెన్‌ యూనిట్లు, జన్‌ ఆహార్‌ సర్వీస్‌ కౌంటర్లలో లభిస్తాయి.

జనరల్‌ కోచ్‌లు ఆగే ప్రదేశంలో ప్లాట్‌ఫామ్‌పై ఈ సర్వీస్‌ కౌంటర్లు ఉంటాయి. ఎక్కువ మంది ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ఈ ఎకానమీ మీల్స్‌ను తొలుత హైదరాబాద్‌, విజయవాడ, రేణిగుంట, గుంతకల్‌ రైల్వే స్టేషన్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలు ఈ నాలుగు స్టేషన్స్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయ్‌. జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి సరసమైన ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. భోజనం మెనులో సౌత్‌ ఇండియన్‌ వంటకాలు కూడా ఉన్నాయి.

ఈ ఎకానమీ భోజనం ప్రయాణిలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ. అరుణ్‌ కుమార్‌ జైన్‌ అన్నారు. దీనిద్వారా ప్రయాణికులు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని పొందగలరన్నారు. ప్రస్తుతం నాలుగు స్టేషన్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు భవిష్యత్తులో ఇతర స్టేషన్స్‌లోనూ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర
గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర
రెండే రెండు చాలు.. అన్నం తిన్నార వీటిని తింటే ఏం జరుగుతుందో..
రెండే రెండు చాలు.. అన్నం తిన్నార వీటిని తింటే ఏం జరుగుతుందో..
టీమిండియాలో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
టీమిండియాలో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ రత్నం ఓ వరం!.. ఏ వేలికి ధరించాలంటే..
ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ రత్నం ఓ వరం!.. ఏ వేలికి ధరించాలంటే..
నవపంచమి యోగం! పెళ్లి, సంపద, కెరీర్‌లో జాక్‌పాట్ కొట్టే రాశులు ఇవే
నవపంచమి యోగం! పెళ్లి, సంపద, కెరీర్‌లో జాక్‌పాట్ కొట్టే రాశులు ఇవే
ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక ఇక్కట్లు
ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక ఇక్కట్లు
ఆధార్, పాన్ వాడుతున్నారా..? కేంద్రం నుంచి పెద్ద ఊరట
ఆధార్, పాన్ వాడుతున్నారా..? కేంద్రం నుంచి పెద్ద ఊరట
15 ఏళ్ల వయసు.. 15 భారీ లక్ష్యాలు.. ఈ ఐపీఎల్లో వైభవ్ సాధిస్తాడా ?
15 ఏళ్ల వయసు.. 15 భారీ లక్ష్యాలు.. ఈ ఐపీఎల్లో వైభవ్ సాధిస్తాడా ?
ఏం సిరీస్ మావ.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న హారర్ థ్రిల్లర్..
ఏం సిరీస్ మావ.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న హారర్ థ్రిల్లర్..
ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు
ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు