Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చేప ప్రసాదం కోసం భారీగా తరలివచ్చిన జనం..

మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. పూర్తి డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం ..

Hyderabad: చేప ప్రసాదం కోసం భారీగా తరలివచ్చిన జనం..
Fish Prasadam
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 08, 2025 | 10:09 PM

మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వయంగా చేప ప్రసాదం స్వీకరించారు. సోమవారం ఉదయం 9గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఈ సారి 42 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పంపిణీ కోసం ఫిషరీస్ శాఖ లక్ష చేపలను సిద్ధంగా ఉంచింది. బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేసే చేప ప్రసాదం స్వీకరించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీగా తరలివచ్చారు. ఆస్తమా, ఉబ్బసం, దగ్గు, దమ్ము లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఈ చేప ప్రసాదాన్ని ఇస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా చేప ప్రసాదం అందిస్తూ.. లక్షలాది మంది రోగులకు జబ్బు నయం చేసిన బత్తిని సోదరులకు కేంద్రం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి పొన్నం.

హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూడా చేప ప్రసాదం పంపిణీని పరిశీలించారు. బత్తిని సోదరుల కుటుంబ సభ్యులంతా 48గంటల పాటు చేప ప్రసాదం పంపిణీలో పాల్గొంటున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారి కోసం ఆర్టీసీ 140 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. చేప ప్రసాదం కోసం వచ్చి.. క్యూలైన్‌లో మెదక్‌ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు చనిపోయాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..