AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అమ్మాయి అందంగా ఉందని మోసపోకు మిత్రమా.. ఆమె వీడియోలకు లైక్ కొట్టారంటే ఇక మీ పని గోవిందా..

అందంగా లేనా.. అసలేం బాలేనా అంటూ ఓ యువతి భారీ మోసానికి తెరలేపింది. ఇన్ స్టా, ఫేస్బుక్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది.

Hyderabad: అమ్మాయి అందంగా ఉందని మోసపోకు మిత్రమా.. ఆమె వీడియోలకు లైక్ కొట్టారంటే ఇక మీ పని గోవిందా..
Hyderabad Crime
Shaik Madar Saheb
|

Updated on: Dec 18, 2022 | 12:22 PM

Share

అందంగా లేనా.. అసలేం బాలేనా అంటూ ఓ యువతి భారీ మోసానికి తెరలేపింది. ఇన్ స్టా, ఫేస్బుక్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఎవరైనా అబ్బాయిలు లైక్ కొడితే.. వారి నుంచి సర్వం దోచేయడం మొదలు పెట్టింది. ఈ కీలాడీ లేడీ, ఆమె ప్రియుడు మోసానికి ఎందరో బాధితులుగా మిగిలారు.. ఈ షాకింగ్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఓ యువతి మోసాల బాటపట్టగా.. ఆమెకు ఓ యువకుడు సహకరించాడు. దీంతో ఆమె తన అందం.. అభినయంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకుంది.  అలా కొందరిని టార్గెట్ చేసి.. పెళ్లి చేసుకుంటానంటూ వలపు వల విసిరి భారీగా డబ్బు వసూలు చేసేది. హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం పట్టణానికి చెందిన పరసా తనుశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు అకౌంట్లు ఉన్నాయి. ఈ అకౌంట్లను వేలమంది ఫాలో అవ్వుతున్నారు.. ఆమె చేసే వీడియోలకు కొందరు లైక్ చేయడంతోపాటు కామెంట్లు చేసేవారు.

అయితే తేలిగ్గా డబ్బు సంపాదించేయాలనే పిచ్చి ఆలోచనతో తనుశ్రీ.. పరసా శ్రీకాంత్ తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను మోసం చేయడం ప్రారంభించింది. ఇలా Instagram, facebook అందమైన ఫొటోస్, వీడియోలు పెట్టి.. లైకులు కొట్టిన వారిని తనుశ్రీ ట్రాప్ చేసింది. ప్రేమ పెళ్లి పేరుతో యువకులను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తుండేంది. ఆమె వీడియోల కింద కామెంట్లు పెట్టేవారికి తిరిగి పర్సనల్‌గా మెసేజ్‌లు పంపించేది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి డబ్బు వసూలు చేసేది.

ఇలా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో స్నేహం పెరిగాక పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అనంతరం తన తల్లికి అనారోగ్యం బాగోలేదంటూ 8 నెలల్లో 31లక్షల 66వేలు వసూలు చేసింది. ఆమెది మోసమని గ్రహించిన యువకుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

కృష్ణాజిల్లా చెందిన పరాస తనుశ్రీని, ఆమెకు సహకరిస్తున్న శ్రీకాంత్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, వీరిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల్లోని చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో శుభవార్త
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో శుభవార్త
బిర్యానీ తింటుండగా బల్లి ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
బిర్యానీ తింటుండగా బల్లి ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
అదిరిందయ్య చంద్రం...మండే ఎండలకు చెక్‌పెడుతూ కొత్త ఐడియా..
అదిరిందయ్య చంద్రం...మండే ఎండలకు చెక్‌పెడుతూ కొత్త ఐడియా..
పురుషులందరూ ఏటా ఈ టెస్ట్ చేయించుకోవాలి: హీరో అక్షయ్ కుమార్
పురుషులందరూ ఏటా ఈ టెస్ట్ చేయించుకోవాలి: హీరో అక్షయ్ కుమార్
ఎంత ఘోరం.. అనుమానమే పెనుభూతమైంది.. భార్యను చంపి, భర్త ఆత్మహత్య..
ఎంత ఘోరం.. అనుమానమే పెనుభూతమైంది.. భార్యను చంపి, భర్త ఆత్మహత్య..
ఏం అదృష్టం రా బాబు.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి లక్కే లక్కు!
ఏం అదృష్టం రా బాబు.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి లక్కే లక్కు!
కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారా..? కేంద్రం రూ.15 వేల సాయం
కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారా..? కేంద్రం రూ.15 వేల సాయం
సంజూ శాంసన్ పేల్చిన జోకులకు వేదిక అంతా ఫిదా
సంజూ శాంసన్ పేల్చిన జోకులకు వేదిక అంతా ఫిదా
భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. యాదాద్రిలోనూ తిరుమల తరహా సేవలు
భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. యాదాద్రిలోనూ తిరుమల తరహా సేవలు
ఇష్టంగా కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా..
ఇష్టంగా కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా..