AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్..

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్..
Rape Case
Shaik Madar Saheb
|

Updated on: Feb 08, 2023 | 11:14 AM

Share

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది. మద్యం తాగించి ఆ తర్వాత బాలిక (14)పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మెడికల్ షాప్‌కు వెళ్లిన బాలికను ట్రాప్‌ ఓ మహిళ ట్రాప్ చేసింది. తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానని ఓ మహిళ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది. అనంతరం ఆ తర్వాత గంజాయి మత్తులో ఉన్న యువకులకు అప్పగించింది. ఆ తర్వాత ఆమెను గదిలో బంధించిన యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో బాలిక కేకలు వినిపించకుండా రూమ్ లో మ్యూజిక్ సౌండ్ గట్టిగా పెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

కాగా.. ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. గ్యాంగ్ రేప్ ఒక పాల్పడ్డ అయిదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకి మద్యం తాగించి నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొంటున్నారు. గంజాయి మత్తులో బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..