AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నారాయణ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 250 మంది విద్యార్థినులకు అస్వస్థత

హైదరాబాద్‌ మల్లంపేట్‌ నారాయణ బాలికల క్యాంపస్‌లో కలుషితాహారం తిన్న 250 మంది విద్యార్థినులు అనారోగ్యంపాలయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. క్యాంటీన్‌ కిచెన్‌లో కాలం చెల్లిన మసాలాలు వాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కలుషిత తాగునీరు, అపరిశుభ్ర వాతావరణమే విద్యార్థినుల అస్వస్థతకు కారణమంటున్నారు తల్లిదండ్రులు.

Hyderabad: నారాయణ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 250 మంది విద్యార్థినులకు అస్వస్థత
Narayana College
Ram Naramaneni
|

Updated on: Jan 06, 2024 | 10:17 AM

Share

నారాయణ కళాశాల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. మల్లంపేట్‌ ORR బ్రాంచ్‌ గర్ల్స్‌ క్యాంపస్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఏకంగా 250 విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలం చెల్లిన పదార్ధాలను ఉపయోగిస్తూ ఆహారం వండుతున్నారని విద్యార్ధినిలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, మంచినీరు సైతం పరిశుభ్రంగా ఉండటంలేదని, వంటశాల అపరిశుభ్రంగా ఉంటోందని, ఆహారం విషయంలో కానీ, శుభ్రత విషయంలో కానీ నాణ్యత పాటించడంలేదని విద్యార్ధినిల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురయిన 200 మంది విద్యార్థినిలను కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించివేసింది. కళాశాలలో 2 వేలమందికి పైగా విద్యార్ధినిలు ఉండటంతో వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసి పిల్లల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కళాశాల నిర్వాహకులు, అధికారులు హాస్టల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..