AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Free Water Scheme: ఇర‌వై వేల‌ ఉచిత మంచినీటి పథకానికి గడువు పెంపు..!

జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న వినియోగదారులు 20 వేల ఉచిత తాగునీటి పథకం పొందేందుకు కొత్త మీటర్ బిగింపు, ఆధార్ అనుసంధానం చేయనున్న సంగతి తెలిసిందే.

GHMC Free Water Scheme: ఇర‌వై వేల‌ ఉచిత మంచినీటి పథకానికి గడువు పెంపు..!
Ghmc Free Water Scheme
Venkata Chari
|

Updated on: Jul 06, 2021 | 8:23 PM

Share

GHMC Free Water Scheme: జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న వినియోగదారులు 20 వేల ఉచిత తాగునీటి పథకం కోసం కొత్త మీటర్ బిగింపు, ఆధార్ అనుసంధానం చేయనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు జలమండలి నగరంలోని వినియోగదారులకు 15 ఆగష్టు 2021 వరకు తాగునీరు, సీవరేజి బిల్లులను నిలిపివేసింది. ప‌నిచేస్తున్న నీటి మీటర్లు కలిగిన డొమెస్టిక్ వినియోగదారులు 15 ఆగష్టు 2021 వరకు ఈ పథకం పొందేందుకు తమ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. ఇలాంటి వారికి ఆగష్టు నెల వరకు నీటి బిల్లుపై ఇర‌వై వేల లీట‌ర్ల వ‌ర‌కు రిబేటు లభిస్తుంది. ఈ పథకానికి అర్హత పొందడానికి, వినియోగదారులు తమ క్యాన్ నెంబర్ కు ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వారి కనెక్షన్ కు ప‌నిచేస్తున్న నీటి మీటర్ కలిగి ఉండాలి. డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులు తమ కనెక్షన్లకు మీటర్ బిగించుకోవల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ పరిధి లోని మీటర్ కలిగిన బల్క్, ఎంఎస్బీ వినియోగదారులు ఫ్లాట్ వారీగా తమకు జీహెచ్ఎంసీ జారీ చేసిన PTIN నంబర్ నమోదు చేసుకుని, ఆధార్ లింక్ ను 15 ఆగష్టు 2021 లోగా పూర్తి చేసుకోవాలి. ఒక గృహ సముదాయంలో (అపార్ట్ మెంట్) ఎన్ని ఫ్లాట్ ల యజమానులు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేస్తారో వారికి మాత్రమే ఇర‌వై వేల లీట‌ర్ల వ‌ర‌కు రిబేటు ల‌భిస్తుంది. ఆధార్ అనుసంధానం చేయని మిగతా ఫ్లాట్ యజమానులకు యథావిధిగా బిల్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

ఇప్పటి వ‌ర‌కు ఇర‌వై వేల లీట‌ర్ల ఉచిత నీటి సరఫరా పథకానికి దరఖాస్తు చేయని వినియోగదారులందరూ.. ఆగష్టు 15 లోపు మీట‌ర్ బిగింపు, ఆధార్ అనుసంధానం చేసుకొని ల‌బ్ధి పొంద‌వ‌చ్చని జలమండలి అధికారులు తెలిపారు. ఆగష్టు 15 తర్వాత కూడా ఈ పథకాన్ని పొందవచ్చని జలమండలి పేర్కొంది.ఇలాంటి వారికి 2020 డిసెంబర్ నెల నుంచి 31 ఆగష్టు 2021 వరకు నీటి బిల్లులు జారీ చేయనున్నట్లు తెలిపారు. కాని, వీరు ఎలాంటి వడ్డీ, జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. వినియోగదారులు ఈ బిల్లులను సెప్టెంబర్ లోగా చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ కనెక్షన్లకు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలంటే తమ దగ్గర్లో ఉన్న మీ-సేవా కేంద్రాల్లో గానీ, లేదా నేరుగా జలమండలి వెబ్ సైట్ www.hyderabadwater.gov.in ను సందర్శించి అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాల కోసం వినియోగదారులు కస్టమర్ కేర్ నంబర్ 155313 లో సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.

Also Read:

TS High Court: ఫీజు చెల్లించలేదని ఆన్‌లైన్‌ తరగతులను ఆపుతారా.? హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రశ్నించిన హైకోర్టు.

KTR Tweet: ‘ఈ నిరసన విధానం బాధ్యతారాహిత్యం’.. అసహనం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌. ఇంతకీ ఏం చేశారనేగా.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..