Hyderabad: వీధి కుక్కల దాడిలో గాయాలపాలైన మరో బాలుడు.. జీహెచ్ఎంసీ అధికారులపై స్థానికులు ఆగ్రహం..
వీధి కుక్కల దాడిలో 4ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ముసారాంబాగ్, లక్ష్మీనగర్ కాలనీలో శని వారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత బాలుడి తల్లి దండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరి మండలం, వీరేపల్లిపేట గ్రామానికి చెందిన సాయి కుమార్, అలేఖ్య దంపతులకు ఇద్దరు కుమారులు. ఉపాధి కోసం నగరానికి వచ్చి ముసారాంబాగ్లోని లక్ష్మీనగర్ కాలనీ శ్రీనిధి నిలయంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు.
వీధి కుక్కల దాడిలో 4ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ముసారాంబాగ్, లక్ష్మీనగర్ కాలనీలో శని వారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత బాలుడి తల్లి దండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరి మండలం, వీరేపల్లిపేట గ్రామానికి చెందిన సాయి కుమార్, అలేఖ్య దంపతులకు ఇద్దరు కుమారులు. ఉపాధి కోసం నగరానికి వచ్చి ముసారాంబాగ్లోని లక్ష్మీనగర్ కాలనీ శ్రీనిధి నిలయంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు. తమ కొడుకు ఉజ్వల్ కుమార్ (4) శనివారం రాత్రి అపార్ట్మెంట్ గేటును పట్టుకుని ఆడుకుంటున్నాడు. బాలుడిపై ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయని చెబుతున్నారు.
ఒక కుక్క బాలుడి ముఖంపై దాడి చేయగా, మరో కుక్క కాలు పట్టుకుని బయటికి లాకెళ్లేందుకు ప్రయత్నించింది. భయాందోళనకు గురైన బాలుడు బిగ్గరగా ఏడ్చాడు. దీంతో తల్లి అలేఖ్య ఇంట్లో నుంచి పరిగెత్తుకుని వచ్చి వీధి కుక్కలను తరిమేసింది. అప్పటికే బాలుడి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు గాయాలను పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలపడంతో ఇంటికి తీసుకువచ్చారు. వీధి కుక్కల సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పురనావృత్తం కాకుండా చూడాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..