భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్పై కేసు నమోదు
హైదరాబాద్: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, అర్జున్ అవార్డు గ్రహీత ముఖేష్ కుమార్పై కేసు నమోదు అయింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం పొందినందుకు గాను అతనిపై సికింద్రాబాద్ బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వారాల క్రితమే అతనిపై కేసు నమోదు చేసినప్పటికీ ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బోయినపల్లి సీఐ రాజేశ్ మాట్లాడుతూ.. ‘ఎయిర్లైన్స్లో ఉద్యోగం కోసం ముఖేష్ పలు పత్రాలు సమర్పించారు. వాటిపై విచారణ జరపగా.. అతడు […]
హైదరాబాద్: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, అర్జున్ అవార్డు గ్రహీత ముఖేష్ కుమార్పై కేసు నమోదు అయింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం పొందినందుకు గాను అతనిపై సికింద్రాబాద్ బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వారాల క్రితమే అతనిపై కేసు నమోదు చేసినప్పటికీ ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బోయినపల్లి సీఐ రాజేశ్ మాట్లాడుతూ.. ‘ఎయిర్లైన్స్లో ఉద్యోగం కోసం ముఖేష్ పలు పత్రాలు సమర్పించారు. వాటిపై విచారణ జరపగా.. అతడు నకిలీ పత్రాలతో కుల ధ్రువీకరణ పత్రం పొందినట్టు వెల్లడైనట్లు తెలిపారు.
నాయీ బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ముఖేష్ నకిలీ పత్రాల ద్వారా ఎస్పీ కుల ధృవీకరణ పత్రాన్ని పొందినట్టుగా గుర్తించారు. మూడు రోజులుగా ముఖేష్ పరారీలో ఉన్నారు. అతని కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చేపడుతున్నారు. ముఖేష్తో పాటు అతని తమ్ముడి సురేష్ పైన కూడా కేసు నమోదయ్యింది. కాగా, కెరీర్లో 307 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ముఖేష్ 80 గోల్స్ చేశాడు.