విజయనిర్మల సంతాప సభ.. హాజరైన ప్రముఖులు

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల (73) జూన్ 27 తెల్లవారు జామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని కాంటినెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మృతితో తెలుగు పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ముఖ్యంగా సీనియర్ స్టార్ కృష్ణ కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా.. ఈరోజు హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షల్ సెంటర్‌లో కృష్ణ కుటుంబసభ్యులు సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయ నిర్మల కుటుంబసభ్యులతో పాటు, సినీ, […]

విజయనిర్మల సంతాప సభ.. హాజరైన ప్రముఖులు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 06, 2019 | 5:38 PM

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల (73) జూన్ 27 తెల్లవారు జామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని కాంటినెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మృతితో తెలుగు పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ముఖ్యంగా సీనియర్ స్టార్ కృష్ణ కన్నీరు మున్నీరుగా విలపించారు.

కాగా.. ఈరోజు హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షల్ సెంటర్‌లో కృష్ణ కుటుంబసభ్యులు సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయ నిర్మల కుటుంబసభ్యులతో పాటు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. జయసుధ, బాలకృష్ణ, సుబ్బిరామిరెడ్డి, గల్లా జయదేవ్, మురళీ మోహన్, రమాప్రభ, కొవై సరళ తదితరులు హాజరయ్యారు. సినిమా సెట్‌లోని ఆమెతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.