Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పెళ్లయిన మరుక్షణమే ప్రియుడితో వధువు జంప్… ట్విస్ట్ ఏంటంటే

పెళ్లయిన మరుక్షణమే భర్తను వదిలి ప్రియుడితో ఉడాయించింది ఓ నవ వధువు. అంతేకాదు పెళ్లి చేసుకున్న వ్యక్తికి కుచ్చుటోపీ పెట్టి అక్కడ్నుంచి జంప్ అయ్యింది.

Hyderabad: పెళ్లయిన మరుక్షణమే ప్రియుడితో వధువు జంప్... ట్విస్ట్ ఏంటంటే
Bride Escape
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 20, 2021 | 4:45 PM

పెళ్లయిన మరుక్షణమే భర్తను వదిలి ప్రియుడితో ఉడాయించింది ఓ నవ వధువు. పెళ్లి సందర్భంగా వరుడు వధువుకి కొంత డబ్బు, బంగారం మెహర్‌గా ఇచ్చాడు. అవి చేతికందగానే తాళి కట్టిన భర్త కళ్లు గప్పి ప్రియుడితో పారిపోయింది. మోసపోయానని తెలుసుకున్న వరుడు నెత్తీనోరూ బాదుకుంటున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన మహమ్మద్‌ ఇలియాస్‌ – హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సమ్రిన్‌ బేగంకి పెళ్లి నిశ్చయించారు పెద్దలు. సెప్టెంబర్‌ 18న హైదరాబాద్‌ బాలాపూర్‌లోని ఓ ఇంట్లో పెళ్లి జరిగింది. వివాహానికి ముందే ఇలియాస్‌, సమ్రిన్‌ బేగంకి రెండు లక్షల విలువైన బంగారం, 50 వేల రూపాయలు క్యాష్‌ మెహర్ (గిఫ్ట్‌)గా ఇచ్చాడు. దీంతో పెళ్లి తంతు సజావుగా పూర్తయింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో పెళ్లికూతురు మేనత్త, చిన్నమ్మ వచ్చి సమ్రిన్‌ను పార్లర్‌కు తీసుకువెళ్తున్నామని చెప్పి బయటకు తీసుకెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. పార్లర్‌కు వెళ్తున్నామని చెప్పి తీసుకెళ్లిన సమ్రిన్‌ను, ఆమె ప్రియుడి వెంట పంపించేశారు.  పెళ్లికొడుకు ఇచ్చిన నగదు, బంగారం తీసుకొని ఆమె ప్రియుడితో ఎస్కేప్ అయ్యింది. ఎంతసేపటికి సమ్రిన్‌ బేగం తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన మహమ్మద్‌ ఇలియాస్‌ ఆమె మేనమామలను నిలదీశాడు. దాంతో వారు నీళ్లు నమిలారు. మోసపోయానని గ్రహించిన  ఇలియాస్‌.. తనకు ఆమె భార్యగా వద్దని లేల్చి చెప్పాడు.  తాను ఇచ్చిన డబ్బు, బంగారం తిరిగి ఇవ్వకపోతే పోలీసులకు కంప్లైంట్ చేస్తానని సమ్రిన్‌ మేనమామలను హెచ్చరించాడు. దాంతో తమకు కొంత గడువు ఇమ్మని, అన్నీ సెటిల్‌ చేస్తామని చెప్పడంతో అతడు శాంతించాడు.

Also Read: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు.. సీఎంపై వ్యాఖ్యలతో అట్టుడుకుతోన్న ఏపీ

ఎదురీత ముందు విధిరాత ఎంత!.. ఒకప్పుడు అవమానాలు, ఛీత్కారాలు.. ఇప్పుడు సన్మానాలు