AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ప్రయాణికులకు శుభవార్త.. నేడు రోడ్లపైకి సరికొత్త సూపర్ లగ్జరీ బస్సులు.. ప్రత్యేకతలు ఇవే

తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త. ప్రత్యేక సదుపాయాలతో కూడిన సరికొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు రోడ్ల మీదకు రానున్నాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ వేదికగా జరిగే కార్యక్రమంలో ఈ కొత్త సూపర్‌ లగ్జరీ బస్సుల ను ప్రారంభించనున్నారు.

TSRTC: ప్రయాణికులకు శుభవార్త.. నేడు రోడ్లపైకి సరికొత్త సూపర్ లగ్జరీ బస్సులు.. ప్రత్యేకతలు ఇవే
Tsrtc Super Luxury Buses
Basha Shek
|

Updated on: Dec 24, 2022 | 8:37 AM

Share

తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త. ప్రత్యేక సదుపాయాలతో కూడిన సరికొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు రోడ్ల మీదకు రానున్నాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ వేదికగా జరిగే కార్యక్రమంలో ఈ కొత్త సూపర్‌ లగ్జరీ బస్సుల ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీరితో పాటు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, రవాణా, రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్దా ప్రకాశ్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది టీఎస్ఆర్టీసీ. ఇందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని యాజమాన్యం భావించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్‌ లగ్జరీ, 130 డిలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చిన సంగతి తెఇసిందే. ఈ బస్సులన్నీ మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.

ప్రయాణికుల భద్రత కోసం ..

కాగా కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయం కల్పించడం జరుగుతుంది వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్‌ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. అలాగే, ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యురిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్ డీఏఎస్) ఏర్పాటు చేశారు. బస్సులో మంటల చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగిన అలారం ఆటోమెటిక్‌గా మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్ డీఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us